/rtv/media/media_files/2025/05/17/AxJrxsAtFXCocEJxP9sd.jpg)
Brahmos Missiles
భారత్, పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను భారత్ ధ్వంసం చేసింది. అయితే యుద్ధం మొదలవక ముందు నుంచే ఎయిర్ బేస్ ల ట్రాక్ దొరకకుండా ఇరు దేశాలు జాగ్రత్తపడ్డాయి. జామర్లను పయోగించి తమ లోకేషన్లను సీజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడే భారత్ తెలివిని ఉపయోగించిందని తెలుస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను తెలుసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందు వెళ్ళినట్టు తెలుస్తోంది. దీని కోసం ముందు యుద్ధ విమానాలను తలపించే డమ్మీ ఎయిర్ క్రాఫ్ట్ ను ప్రయోగించింది భారత ఆర్మీ. వాటిని చూసి పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను యాక్టివేట్ చేసింది. ఆ తరువాత అదే అదనుగా భారత్ ఆ లోకేషన్స్ ను ట్రాక్ చేసింది. దాని తరువాత బ్రహ్మోస్ క్షిపణులను పాకిస్తాన్ ఎయిర్ బేస్ ల మీదకు ప్రయోగించి...వాటిని నాశనం చేసింది.
మొదటిసారి సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్..
పాకిస్తాన్లోని వివిధ వైమానిక దళ స్థావరాలపై భారతదేశం దాదాపు 15 బ్రహ్మోస్ లను ప్రయోగించింది. భారత్ మొదటిసారి ఇంత మొత్తంలో బ్రహ్మోస్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులను మరియు స్కాల్ప్, రాంపేజ్, క్రిస్టల్ మేజ్ క్షిపణులను ప్రయోగించింది. మిస్సైళ్ళతో వైమానిక రక్షణ రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను నాశనం చేసిందని భారత ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ వైమానిక దళం తన HQ-9 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థ లాంచర్లు, రాడార్లను వేర్వేరు ప్రదేశాలకు తరలించడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. మరోవైపు పాకిస్తాన్ వైమానికి దాడులను అడ్డుకోవడానికి రష్యన్ S-400, MRSAM, ఆకాశ్ వైమానిక రక్షణ క్షిపణి యూనిట్ వంటి ఆధునిక వ్యవస్థలను భారత్ ఉపయోగించింది.
today-latest-news-in-telugu | Indian Army | IND-PAK War | brahmos missiles
Also Read: Rajasthan: తెరపైకి మరో సారి కృష్ణజింకల కేసు..రాజస్థాన్ ప్రభుత్వం సవాల్