Tamilnadu: హిందీ భాష రుద్దడంపై పవన్‌ వ్యాఖ్యలు దుమారం.. స్పందించిన డీఎంకే

తమిళ సినిమాలను హిందీ భాషలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని అని ప్రశ్నించిన పవన్‌ వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది.మేము వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని ఎప్పుడూ కూడా అడ్డుకోలేదని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Pawan kalyan and MK Stalin

Pawan kalyan and MK Stalin

జాతీయ విద్యా విధానం(NEP)లో భాగంగా త్రిభాషా విధానంపై కేంద్రం, తమిళనాడు మధ్య వివాదం కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన జనసేన ఆవిర్భవ సభలో కూడా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడారు. దక్షిణాదిపై హిందీ రుద్దుతున్నారని అన్నప్పుడు తమిళ సినిమాలను హిందీ భాషలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారని ప్రశ్నించారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయీద్ హఫీజుల్లా స్పందించారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.  

Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు

'' మేము వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని ఎప్పుడూ కూడా అడ్డుకోలేదు. ఆసక్తి ఉన్నవాళ్లు భాషను నేర్చుకునేందుకు ఇప్పటికే తమిళనాడులో హిందీ ప్రచార సభలు చేపడుతున్నాం. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఎన్‌ఈపీ, పీఎం శ్రీస్కూల్స్‌ వంటి విధానాలతో మా రాష్ట్ర ప్రజలపై హిందీ భాషను రుద్దుతున్నారు. అందుకే దీన్ని మేము వ్యతిరేస్తున్నామని'' డీఎంకే ప్రతినిధి చెప్పారు.  

Also Read: డీలిమిటేషన్‌ వల్ల సీట్లు తగ్గుతాయా ? కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

అలాగే డీఎంకేకు చెందిన మరో సీనియర్ నేత టీకేఎస్‌ ఎళన్‌గోవన్ కూడా మాట్లాడారు. ''1938 నుంచే తమిళనాడు ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తు్న్నాం.ద్విభాషా విధానాన్నే అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చట్టాన్ని కూడా ఆమోదించాం. నిపుణుల సలహా, సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. సినీనటుడు, రాజకీయ నాయకులు అభిప్రాయాలతో ఏకీభవించాల్సిన అవసరం లేదు. 1968లో ఈ బిల్లు ఆమోదం పొందినప్పడు పవన్ ఇంకా పుట్టి ఉండరు. తమిళ రాజకీయాలపై ఆయనకు అవగాహన లేకపోయి ఉండొచ్చని'' విమర్శలు చేశారు. 

Also Read: వారం వ్యవధిలో రెండు సార్లు..టెస్లా షోరూం పై కాల్పులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు