/rtv/media/media_files/2025/03/15/FOjLtCWRsg3XkooIu8AI.jpg)
Kishan Reddy Responds on Delimitation
ప్రస్తుతం డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గుతాయనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ఇంకా కొత్త విధానం రాలేదని అన్నారు. డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గుతాయనేది దుష్ర్పచారం మాత్రమేనని స్పష్టం చేశారు. పునర్విభజనకు సంబంధించి 2009లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికి కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు
అలాగే త్రిభాషా విధానం అనేది కూడా దేశంలో కొత్తదేమి కాదన్నారు. ''కేంద్రం తమపై బలవంతంగా హిందీ రుద్దుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరిపై కూడా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయలేదు. ఏ భాష కావాలంటే అందులో చదువుకునే ఛాన్స్ ఉంది. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి నిర్మాతలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్లకి ఈ లాభాలు ఎలా వస్తున్నాయి?. భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం కరెక్ట్ కాదు. సీఎంగా స్టాలిన్ ఏం చేశాడో చెప్పి తమిళ ప్రజలను ఓట్లు అడగాలి. ఆయన ఏం చేయలేదు. అందుకే ఇలా భాష పేరుతో దుష్ర్పచారం చేస్తున్నారని'' కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. యూనెస్కో జాబితాలో ముడమాల్ నిలువురాళ్లు
మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కేంద్రం వివిధ రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తోందని తెలిపారు. త్వరలో బేగంపేట రైల్వే్స్టేషన్ను ప్రారంభిస్తామన్నారు. మరో 10 శాతం పనులు మిగిలిఉన్నాయని.. ఎయిర్పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయని.. మరో రూ.12 కోట్లతో రెండో విడత పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే బేగంపేట రైల్వేస్టేషన్లో అందరూ మహిళా ఉద్యోగులే ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు.
Also Read: పవన్ కళ్యాణ్ను వదిలిపెట్టని ప్రకాశ్రాజ్.. Xలో సెటైర్ల వర్షం