BIG BREAKING: తమిళిసై సౌందరరాజన్ అరెస్టు..
తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ను అరెస్టు చేశారు.
తమిళనాడులో త్రిభాషా వివాదం ముదురుతోంది. ఈ విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ను అరెస్టు చేశారు.
సీఎం స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష వల్ల ఉత్తర భారత్లో 25 భాషలు కనుమరుగైపోయాయని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. తమిళనాడుకు ఇలాంటి పరిస్థితి రావద్దనే ఎన్ఈపీని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
తమిళ భాష ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదని అమిత్ షా అన్నారు. ఇలాంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలకు కోరారు. కోయంబత్తూర్లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 2026లో తమిళనాడులో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
నూతన విద్యా విధానం వల్ల కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దేందుకు యత్నిస్తున్నారని, మరో భాషా యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామని సీఎం స్టాలన్ అన్నారు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
చిన్న పిల్లలకు ఆరేళ్లు నిండితేనే 1st క్లాస్లో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మోదీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లలకు 3 ఏళ్ల ప్రీ స్కూల్, 1, 2 తరగతులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ఈపీ అనేది విస్తృతమైన ఫ్రేమ్ వర్క్ అని తెలిపారు. తమ అవసరాలకు అనుగుణంగా ఎన్ఈపీ అమలు చేసే అవకాశాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టామన్నారు. ఎన్ఈపీ అనేది కేంద్రం నిర్ణయించి అన్ని రాష్ట్రాలపై విధించేది కాదని తెలిపారు.