BREAKING: దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో DGCA తనిఖీలు

డీజీసీఏ రెండు బృందాలుగా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో బుధవారం రాత్రుళ్లు, గురువారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టాయి. తనిఖీల్లో అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ పేర్కొంది. విమానాల్లో లోపాలు, రన్‌వేపై సెంటర్‌లైన్‌ మార్కింగ్‌ లేవట.

New Update
DGCA inspections

దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో నిర్వహించిన తనిఖీల్లో అనేక నిర్వహణ లోపాలు గుర్తించినట్లు డీజీసీఏ పేర్కొంది. విమానాల్లో లోపాలు, రన్‌వేపై సెంటర్‌లైన్‌ మార్కింగ్‌ సరిగా లేకపోవడం వంటివి గుర్తించినట్లు విమానయాన నియంత్రణాధికార సంస్థ తెలిపింది. రన్‌వే భద్రత, విమాన రద్దీ నియంత్రణ, కమ్యూనికేషన్‌-నేవిగేషన్‌ వ్యవస్థలు ఇలా పలు కీలక అంశాలపై నిఘా ఉంచింది. గుర్తించిన లోపాలను ఆయా సంస్థలకు తెలియజేసినట్లు, 7 రోజుల్లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించింది. 

డీజీసీఏ రెండు బృందాలుగా ఢిల్లీ, ముంబయి సహా పలు ప్రధాన విమానాశ్రయాల్లో బుధవారం రాత్రుళ్లు, గురువారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టాయి. అరిగిపోయిన టైర్ల వల్ల విమానం నిలిచిపోవడంతో పాటు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పలు మార్లు విమానాల్లో ఒకే తరహా లోపాలు తలెత్తడం, విమాన కాన్ఫిగరేషన్‌తో సిమ్యులేటర్‌ మ్యాచింగ్‌ కాకపోవడం, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ కాకపోవడం వంటివి గుర్తించినట్లు డీజీసీఏ తెలిపింది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు