/rtv/media/media_files/2025/05/02/Jp2AFofVn0XUUFC69B3W.jpg)
nhcase
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ మాజీ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం వారికి నోటీసులు జారీ చేసింది. ఇటీవలే నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ లపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే సోనియా, రాహుల్ లకు నోటీసులు ఇవ్వాలన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో ప్రతివాదనలు వింటామని కోర్టు తెలుపుతూ తదుపరి విచారణను మే 08వ తేదీకి వాయిదా వేశారు.
Also read : Pathan Khan: 12 ఏళ్లుగా పాకిస్తాన్కు గూఢచర్యం.. రాజస్థాన్లో దొరికిన ఇంటి దొంగ!
While fixing the next date, which is May 8, 2025, the court stated that Sonia Gandhi, Rahul Gandhi, and other proposed accused have the "right to be heard" at the time of cognisance of the chargesheet.
— ANI (@ANI) May 2, 2025
Further stated that the right to be heard at any stage is essential to…
కేసు ఏంటంటే?
నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు సంబంధించిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేయడానికి సోనియా, రాహుల్ నేరపూరిత కుట్ర పన్నారని, 99% వాటాలను కేవలం రూ.50 లక్షలకు బదిలీ చేశారని ఈడీ ఆరోపిస్తుంది. ఈ ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ నియంత్రణలో ఉన్న యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ కేసులో కేసులో వారితో పాటుగా కాంగ్రెస్ నాయకులు సామ్ పిట్రోడా, సుమన్ దూబేలను నిందితులుగా ఈడీ పేర్కొంది.
Also Read: Viral Video : మంచి ముహూర్తం లేదని ఆసుపత్రిలోనే తాళి కట్టాడు!
Also Read : India Air Force : పాకిస్తాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో... ఫైటర్ జెట్లు విన్యాసాలు