/rtv/media/media_files/2025/05/02/eB3EJ92kByMfGFJSQg1H.png)
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలోని బియోరా పట్టణంలో వధువు అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలోనే ఆమె మెడలో తాళి కట్టాడు ఓ వరుడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి అక్షయ తృతీయ శుభ సందర్భంగా వరుడు అదిత్య సింగ్, వధువు నందినిల పెళ్లి జరగాల్సి ఉంది. అయితే వివాహానికి ఐదు రోజుల ముందు అంటే ఏప్రిల్ 24న, నందిని ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. వెంటనే ఆమెను బీవార్లోని పంజాబీ నర్సింగ్ హోమ్లో చేర్పించారు, అక్కడ వైద్యులు ఆమెను మరింత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ముహూర్తం పోతే రెండేళ్ల వరకు
అయితే ఈ ముహూర్తం పోతే రెండేళ్ల వరకు ఆగాల్సి వస్తుందని పురోహితులు చెప్పడంతో కుటుంబీకులు శుభ క్షణాన్ని వృధా చేసుకోకుండా ఆసుపత్రిని వివాహ వేదికగా మార్చింది. ఆసుపత్రి మేనేజ్ మెంట్ ను ఒప్పించి పెళ్లి చేయించారు. పెళ్లి కొడుకు ఆధిత్య గుర్రం మీద మేళతాళాలతో ఆస్పత్రి దగ్గరకు వచ్చాడ. అగ్ని సాక్షిగా నందిని మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితేత తాళి కట్టే సమయంలో నందిని నిలబడలేకపోవడంతో ఓ మహిళ పట్టుకుని నిలబెట్టడంతో ఆధిత్య తాళి కట్టాడు.అనంతరం ఆమెను ఎత్తుకుని ఏడు అడుగులు నడిపించాడు. బంధుమిత్రులు పూల వర్షం కురిపించి నూతన దంపతులకు తమ ఆశీర్వచనాలు తెలిపారు. వీరి అపూర్వ ప్రేమ కథ నెట్టింట వైరల్ అవుతోంది.
💑 प्यार हो तो ऐसा!
— Arth Parkash (@arthparkash1) May 1, 2025
UP के राजगढ़ में दूल्हा बारात लेकर पहुंचा अस्पताल, वहीं रचाई शादी 👰♀️🤵
बीमार दुल्हन की हालत देख नहीं रुका, निभाया हर वादा ❤️
शादी से 5 दिन पहले भर्ती हुई थीं दुल्हन#UttarPradesh #Rajgarh #HospitalWedding #TrueLove #GroomInHospital #ViralNews #RealLoveStory pic.twitter.com/947RVg26NB
Also read : Pathan Khan: 12 ఏళ్లుగా పాకిస్తాన్కు గూఢచర్యం.. రాజస్థాన్లో దొరికిన ఇంటి దొంగ!