జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న యూపీ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్న యుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 వంటివి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్పై విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మొత్తం 3.5 కిలోమీటర్ల మేర ఈ ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం.. గంగా ఎక్స్ప్రెస్ హైవేపై రాత్రి పూట కూడా ల్యాండింగ్ అయ్యే వెసులుబాటుగా ఉంటుంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
షాజహాన్పూర్లో నిర్మాణంలో ఉన్న గంగా ఎక్స్ప్రెస్వేలో 3.5 కి.మీ పొడవైన ఎయిర్స్ట్రిప్ను భారత వైమానిక దళం (IAF) అత్యవసర ల్యాండింగ్ కోసం ఉపయోగించేందుకు సిద్ధం చేసింది. ఈ ఎయిర్స్ట్రిప్ను IAF డ్రిల్ కోసం ఉపయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.#IAFaircraft #UttarPradesh #rtv pic.twitter.com/X6A0uX2tMo
— RTV (@RTVnewsnetwork) May 2, 2025
ఎమర్జెన్సీ టైంలో ప్రత్యామ్నాయ రన్వేగా
ఇవి 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడమే కాకుండా ఎమర్జెన్సీ టైంలో ప్రత్యామ్నాయ రన్వేగా వినియోగంగా సామర్థ్యాన్ని అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం నాలుగు ఎయిర్స్ట్రిప్లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్ప్రెస్వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు.భద్రతను నిర్ధారించేందుకు రన్వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా గంగా ఎక్స్ప్రెస్వేపై ఉన్న ఎయిర్స్ట్రిప్ యుపిలోని షాజహాపూర్లో నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ల్యాండింగ్ స్ట్రిప్ కావడం విశేషం.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
Also Read: ఇజ్రాయెల్లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు