/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Corona-Danger-Bells-jpg.webp)
మహమ్మారి కరోనా మరోసారి విజృభిస్తోంది. గతకొన్ని రోజులుగా దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు తెలిపారు. హాంకాంగ్, సింగపూర్లో పెరుగుతున్న కరోనా కేసులు భారత్పై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కరోనాతో ఇద్దరు చనిపోయారు కూడా. అయితే అవి కరోనా మరణాలు కాదని డాక్టర్లు తెలిపారు. చనిపోయిన ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దేశంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదు.. కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ.. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్న కేంద్రం.. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్లో పెరుగుతున్న కరోనా కేసులు#India
— తార-సితార (@Tsr1257) May 19, 2025
కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూశాయి. గత వారం కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి.
(india | corona | corona-alert | corona-death | corona-updates | corona-cases | latest-telugu-news)