Maoist: మావోయిస్టులకు మరో దెబ్బ..16 మంది కీలక కమాండర్స్ లొంగుబాటు!

మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ఛత్తీష్‌గఢ్ లో 16మంది నక్సల్స్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇద్దరు PLGA సభ్యులు సహా 14మంది నక్సల్స్ బస్తర్ ఎస్పీకిరణ్ చౌహాన్ ఇతర పోలీసు బలగాల ముందు తమ ఆయుధాలు అప్పగించి సరెండర్ అయ్యారు. వీరిపై రూ.25 లక్షల రివార్డు ఉంది. 

New Update
maoist srndr

Chhattisgarh 16 Maoists surrender

Maoist: వరుస ఎన్‌కౌంటర్లతో సతమతమవుతున్న మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ఛత్తీష్ గఢ్ రాష్ట్రంలో 16 మంది నక్సల్స్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుకుమా జిల్లా భద్రత బలగాలు చేపట్టిన లొంగబాటు విధానం, నాయద్ నెల నార్ పథకం విజయవంతమైవుతోంది. ఇద్దరు పియల్‌జిఎ సభ్యులు సహా 14 మంది మావోయిస్టులు బస్తర్ ఎస్పి కిరణ్ చౌహాన్, ఏఎస్ పి ఉమేష్ గుప్తా, సిఆర్పిఎఫ్ సుజిత్ పాల్ వర్మ, ఆర్ యఫ్ టి,కుంట, (డీఐజీఆఫీస్)218 సీఆర్పీ యఫ్,అసిస్టెంట్ కామండెంట్ తిలక్ రామ్, ఉన్నతాధికారుల  ముందు తమ ఆయుధాలు అప్పగించి లొంగి పోయారు.

Also Read: మమతా పాలనలో దారుణాలు.. బెంగాల్‌లో అధికారం మాదే: అమిత్ షా

వీరిపై రూ.25 లక్షల రివార్డు

ఇక వీరందరిపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు తెలిపారు. లొంగిపోయిన వారిలో ఒక మహిళ మావోయిస్టు, ఒక పురుష మావోయిస్టు పై ఒక్కొక్కరికి 8 లక్షలు, ముగ్గురు పురుషులకు 2 లక్షల చొప్పున, మరో పురుష మావోయిస్టుపై 3 లక్షలు మొత్తం 25 లక్షల రివార్డు ప్రకటించారు. ఇక  ఒకపక్క గాలింపు చర్యలు, ఎన్కౌంటర్లకు భయపడి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Also Read: జ్యోతి మల్హోత్రా కేరళ టూర్‌కు సీఎం అల్లుడే స్పాన్సర్.. బీజేపీ సంచలన ఆరోపణలు

chattisaghad | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
తాజా కథనాలు