Chinnaswamy Stadium: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ - మండిపడుతున్న నెటిజన్లు (వీడియోలు)

అల్లు అర్జున్ ‘పుష్ప2’ తొక్కిసలాట సమయంలో థియేటర్‌లో ఉన్నాడు. బయట జరిగిన విషయం చెప్పినా అతడు వినలేదనే ఆరోపణలతో చాలా మంది బన్నీని విమర్శించారు. ఇప్పుడు విరాట్‌ను కూడా తిడుతున్నారు. బయట ఇంత ఘోరం జరిగితే వైఫ్‌తో సంబరాల్లో మునిగితేలుతున్నాడని మండిపడుతున్నారు.

New Update
allu arjun and rcb news

allu arjun and rcb news

ఒకవైపు సంబరాలు మరోవైపు మృత్యు ఘోష. అల్లు అర్జున్ ‘పుష్ప2’, ఆర్సీబీ విజయోత్సవం రెండింటి మధ్య ఒకే విధమైన కారణాలు తొక్కిసలాటకు కారణాలు అయ్యాయి. అల్లు అర్జున్ ‘పుష్ప2’ ప్రీమియర్ సమయంలో భారీగా తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో బన్నీ థియేటర్‌లోపలే ఉన్నాడు. జరిగిన విషయం అతడికి చెప్పినా థియేటర్‌ నుంచి వెల్లలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

అప్పుడు బన్నీ.. ఇప్పుడు విరాట్

దీంతో అతడి తీరుపై చాలా మంది మండిపడ్డారు.  సరిగ్గా ఇప్పుడు బెంగళూరులో కూడా అలాంటిదే జరిగింది. ఒకవైపు స్టేడియం బయట తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. కానీ స్టేడియం లోపల మాత్రం ఆనందోత్సవాల మధ్య ఆర్సీబీ ప్లేయర్లకు సన్మాలు చేశారు.

ఆ సమయంలో కోహ్లీ నవ్వుతూ కార్యక్రమంలో కనిపించడంతో అతడిపై చాలా మంది ఫైర్ అవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. కోహ్లీ హ్యాపీగా ఉండటాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అయితే బయట విషయం తెలియకపోవడంతోనే వారు ఆ మూడ్‌లో ఉన్నారని.. ఈ విషయం తెలియడంతో కార్యక్రమాన్ని కేవలం 10 నిమిషాల్లోనే ముగించేసి వెళ్లిపోయారని కొందరు వెనకేసుకొస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు