/rtv/media/media_files/2025/06/04/zkWOpzboSaWD0DXxwEMB.jpg)
18 ఏళ్ల నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. ఐపీఎల్ ఫైనల్లో కప్పు కొట్టి అభిమానుల దాహం తీర్చింది. అయితే ఈ ఆనందం 18 గంటలు కూడా లేకపోయింది. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికోసం అభిమానులు, క్రికెట్ ప్రియులు వేల సంఖ్యలో స్టేడియానికి తరలివెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. అలాగే గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప2’ సమయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో బాలుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలపాలై ఇటీవలే డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్లకు పోలీకలున్న కారణాలు ఏంటో తెలుసుకుందాం.
Also Read: రీల్స్ పిచ్చి.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అమ్మాయిలు మృతి
తొక్కిసలాటకు కారణాలు
ALLU ARJUN: ‘పుష్ప2’ చిత్రం ప్రీమియర్ సమయంలో సంధ్య థియేటర్కు వచ్చేందుకు అల్లు అర్జున్కు అనుమతి లేదు. కానీ ఆయన థియేటర్కు రావడంతో అభిమానులు భారీ స్థాయిలో వచ్చారు.
RCB: ఆర్సీబీ 18 ఏళ్ల తరువాత కప్ కొట్టడంతో సొంతగడ్డపై ఆటగాళ్లను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
Also Read: టీజీ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పట్నుంచంటే?
ALLU ARJUN: అభిమానుల రాకను పోలీసులు అంచనా వేయలేకపోవడంతో సరిగ్గా ఏర్పాట్లు చేయలేకపోయారు. దీని కారణంగా థియేటర్ వద్ద భారీగా తొక్కిసలాట జరిగింది.
RCB: ఇక ఇప్పుడు బెంగళూరులో సైతం అదే జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని అంచనా వేయలేకపోయిన కర్ణాటక ప్రభుత్వం.. ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయింది.
ALLU ARJUN: అల్లు అర్జున్ తన సినిమా చూసేందుకు సంధ్య థియేటర్కు ప్రీమియర్కు వెళ్లడంతో అభిమానులు పోటెత్తారు. దీంతో కంట్రోల్ తప్పింది.
RCB: కప్ గెలిచిన మరునాడే సన్మాన సభ పెట్టడం కూడా తప్పే అయింది. కప్ గెలిచిన ఉత్సాహం, సంబరాలు ముగియకుముందే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయడంతో అభిమానులు భారీగా పోటెత్తారు.
Also Read: ఆశావర్కర్పై రేప్.. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష
ALLU ARJUN: జనాల్ని కంట్రోల్ చేసేందుకు గేట్లను మూసివేయడంతో ఒక్కసారిగా పోగయ్యారు. దీంతో ఒక్కసారిగా గేట్లు ఎత్తడంతో ముందున్న వారు కింద పడిపోయి మృత్యువాత పడ్డారు.
RCB: చిన్నస్వామి స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు రావడం, ముందుగానే గేట్లు తెరవకపోవడం.. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో అభిమానులు పోటెత్తారు. దీంతో తొక్కిసలాట అయింది.
ALLU ARJUN: పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం కూడా తొక్కిసలాటకు మరో కారణం
RCB: ఇక్కడ కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం కూడా తొక్కిసలాటకు మరో కారణం
ALLU ARJUN: ఒకవేళ సినిమా చూడాలనుకున్నా.. బన్నీ ఎవరికీ చెప్పకుండా ఒక్కడే వచ్చి సైలెంట్గా చూసి వెళ్లిపోతే ఏ ప్రమాదం జరిగేది కాదు.
RCB: ఇక్కడ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయాలని అనుకున్నా అభిమానులు లేకుండా చిన్న వేదికలపై చేయాల్సి ఉంటే ఇప్పుడీ ప్రమాదం జరిగి ఉండేది కాదు.