Cancer Vaccine: త్వరలో క్యాన్సర్‌కు టీకా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

కేంద్ర వైద్యారోగ్య సహాక మంత్రి ప్రతాప్‌రాజ్‌ జాదవ్ కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లోనే టీకా అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ టీకా వేసుకునేందుకు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న బాలికలు మాత్రమే అర్హులని చెప్పారు.

New Update
Cancer Vaccine For Women To Be Available In 6 Months

Cancer Vaccine For Women To Be Available In 6 Months

Cancer Vaccine: ప్రస్తుతం చాలామంది మహిళలు క్యాన్సర్‌కు(Women Cancer) గురవుతుండటం సవాలుగా మారింది. అయితే తాజాగా కేంద్ర వైద్యారోగ్య సహాక మంత్రి ప్రతాప్‌రాజ్‌ జాదవ్(Pratapraj Jadhav) కీలక ప్రకటన చేశారు. క్యాన్సర్‌ను ఎదుర్కొనేందుకు ఐదారు నెలల్లోనే టీకా అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ టీకా వేసుకునేందుకు 9 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న బాలికలు మాత్రమే అర్హులని చెప్పారు. ఈ టీకాపై పరిశోధనలు దాదాపు పూర్తయ్యాయని.. ప్రస్తుతం ట్రయల్స్‌ జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

Also Read : నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో చేశా.. కిరణ్‌ రాయల్ సంచలన ఆడియో! 

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ప్రతాప్‌రాజ్‌ జాదవ్ మాట్లాడారు. '' ప్రస్తుతం దేశంలో క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. 30 ఏళ్లు దాటిన మహిళలకు ఆస్పత్రుల్లో స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం కోసం డేకేర్‌ క్యాన్సర్ సెంటర్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.   

Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?

రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లకు టీకా..

అలాగే క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై కస్టమ్స్‌ సుంకాన్ని రద్దు చేశాం. అందుబాటులోకి రాబోయే ఈ టీకా.. రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లు రాకుండా నియంత్రిస్తుందని'' కేంద్రమంత్రి ప్రతాప్‌రాజ్‌ జాదవ్‌ వెల్లడించారు. అయితే ఇప్పుడున్న ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఆయూష్‌ సౌకర్యాలుగా మార్చడంపై మీడియా ప్రశ్నించింది. దీనికి స్పందించిన ప్రతాప్‌రాజ్‌.. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఆయుష్ విభాగాలున్నాయని ప్రజలకు ఈ సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. 

Also Read: అశ్లీల కంటెంట్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు