ఏపీకి గుడ్‌న్యూస్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది.

New Update
Ashwini Vaishnaw

Ashwini Vaishnaw

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి మీదుగా తమిళనాడులో వెల్లూరు వరకు రైల్వేలైన్‌లో మరో అదనపు రైల్వేలైన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు ఖర్చు చేయనుంది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. మొత్తం 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్‌ డబ్లింగ్‌కు కేంద్రం ఆమెదం తెలిపిందని చెప్పారు. 

Also Read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

'' ఈ ప్రాజెక్టు వల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తిరుపతికి కనెక్టివిటీ పెరగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 35 లక్షల పనిదినాలతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని'' అశ్వినీ వైష్ణవ్ అన్నారు. 

Also read: ట్రం‌ప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు

మరోవైపు PMKSYలో కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్‌ మేనేజ్‌మెంట్ స్కీమ్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2025-26 సంవత్సరానికి కూడా కమాండ్ ఏరియా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1600 కోట్లు ఖర్చు చేయనుంది. 

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

bjp | telugu-news | ashwini-vaishnaw | andhra-pradesh

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు