వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

బ్రిటిష్ వాళ్లను దేశం నుంచి తరిమినట్లే బీజేపీ పార్టీని కూడా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చాడు. అహ్మదాబాద్‌లో నిర్వహించిన AICC మీటింగ్‌లో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.

New Update
revanth reddy AICC meeting

స్వతంత్య్ర పోరాటంలో ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టినట్లే బీజేపీని ఓడించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ సబర్మతి ఆశ్రమంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కు ఆయన హాజరైయ్యారు. మోదీ మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని చీల్చాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ, బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ విధానాలకు వ్యతిరేకంగా.. గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తూ బీజేపీ పని చేస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.

Also read: Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

తెలంగాణలో కులగణన చేసినట్లే దేశావ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీని ఓడించడానికి దేశంలో ఉన్న గాంధేయవాదులంతా ఏకంకావాలని ఆయన సూచించారు. ఆయనతోపాటు రాష్ట్ర ముఖ్య నాయకులు కూడా ఏఐసీసీ సమావేశంలో పాల్గొన్నారు.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు