/rtv/media/media_files/2025/06/27/bihar-becomes-1st-state-to-allow-voting-via-mobile-phone-app-2025-06-27-21-38-44.jpg)
Bihar Becomes 1st State To Allow Voting Via Mobile Phone App
బిహార్ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికలకు మొబైల్ ఫోన్ నుంచే ప్రజలు ఓటువేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. మొబైల్ ఫోన్ యాప్ నుంచే ప్రజలు ఓటు వేయచ్చని తెలిపారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఆరు మున్సిపల్ కౌన్సిల్ పదవులకు శనివారం పోలింగ్ జరగనుంది. పోలింగ్ బూత్కు వెళ్లలేని వాళ్ల కోసం ఈ కొత్త ఓటింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని దీపక్ ప్రసాద్ తెలిపారు.
Also Read: హైదరాబాద్లో ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్.. ఆ చెరువు నీరు తాగద్దు
గర్భిణీలు, వలస ఓటర్లు, వృద్ధులు, వికలాంగులు.. శారీరక లేదా ఇతర కారణాల వల్ల పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేని వాళ్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు. మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఓటింగ్ గురించి జూన్ 10 నుంచి 22 వరకు అవగాహన ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఓటర్ల లిస్టులో పేరు నమోదు చేసుకున్న ఫోన్ నెంబర్కు ఈ యాప్ను లింక్ చేయాలని తెలిపారు.
Also Read: మరో వ్యక్తితో భార్యకు అక్రమ సంబంధం.. దగ్గరుండి పెళ్లి చేయించిన భర్త
10 వేల మంది ఓటర్లు ఇప్పటికే ఈ యాప్లో సైన్అప్ అయినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో దాదాపు 50 వేల మంది పోలింగ్ బూత్లకు వెళ్లకుండానే ఓటు వేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫేస్ మ్యాచ్, బ్లాక్ చేయిన్ ప్లాట్ఫామ్, స్కానింగ్ లాంటి సిస్టమ్లతో కూడిన మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్ విధానం ట్యాంపర్ ప్రూఫ్గా పనిచేస్తుందని వెల్లడించారు. ఇక త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మరి ఈ ఎన్నికలకు కూడా మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఓటు వేసేందుకు పర్మిషన్ ఇస్తారా? లేదా? అనేదానిపై క్లారిటీ లేదు.