పాకిస్తాన్, భారత్ మధ్య హై టెన్షన్ నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై దాడి చేసే ఆలోచనలో భారత్ ఉంది. ఈక్రమంలో బంగ్లాదేశ్ తోక జాడిస్తున్నది. ఆదేశ నేతలు భారత్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మహ్మద్ యూనస్ అనుచరుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
Bangladesh's retired Maj. Gen. Fazlur Rahman threatens to attack India's NE if India hits Pakistan.
— Angry Saffron (@AngrySaffron) May 1, 2025
Bold words from a country that can barely handle its own floods! 😂 pic.twitter.com/GKw0oMo1ap
బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ALM ఫజ్లుర్ రెహమాన్ ఫేస్బుక్లో ఓ సంచలన పోస్ట్ చేశారు. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్కు రెహమాన్ గతంలో అధిపతిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్పర్సన్. పాకిస్తాన్పై అటాక్ చేస్తే ఇండియా 7 ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ ఆక్రమించుకుంటుందని రెహమాన్ ఫేస్బుక్లో పేర్కొన్నారు. దీనికి చైనాతో కలిసి జాయింట్ మిలిటరీ ఆపరేషన్ చేస్తామని చెప్పుకొచ్చాడు.
ALM Fazlur Rahman,
— Alpha Soldier 🪖 (@WolfSoldier313) May 2, 2025
A Retired Bangladeshi Maj Gen, suggested that Bangladesh should invade and occupy all seven northeastern states of India if New Delhi attacks Pakistan, as a retaliation for false flag operation of pehlgam.
Brotherhood 🇵🇰 🇧🇩 ✌🏾 pic.twitter.com/Ny1m3pvprm
భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య భారతదేశంలోని ఏడు రాష్ట్రాలను ఆక్రమించాల్సి ఉంటుంది. ఈ విషయంలో చైనాతో ఉమ్మడి సైనిక ఏర్పాటుపై చర్చలు ప్రారంభించడం అవసరమని నేను భావిస్తున్నాను" అని నేషనల్ ఇండిపెండెంట్ కమిషన్ చైర్పర్సన్ రెహమాన్ ఫేస్బుక్లో బెంగాలీలో రాశారు. ఇటీవల మహ్మద్ యూనస్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. భారత నిఘూ వర్గాలు ఇప్పటికే బంగ్లా సముద్రజలాల్లో పాక్ నేవీ, ISI కదలికలు గుర్తించింది.
(Bangladesh Border | bangladesh | bangladesh-india-border | india pak war | northeast states | latest-telugu-news | pakistan | india)