Ayodhya: అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగి అప్పుడే ఏడాది కావొస్తుంది. అతి తక్కువ సమయంలో కొత్త రికార్డులు నెలకొన్నాయి. ఇటీవలే యూపీలో తాజ్మహల్ కంటే అధికంగా పర్యాటకులు అయోధ్య రామయ్యను దర్శించుకున్నట్లు రికార్డుల్లో నమోదైంది. ఈ నేపథ్యంలో అయోధ్య బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరిగి ఏడాది అవుతున్న నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరంలో భారీ ఉత్సవాలను నిర్వహించేందుకు సిద్దమవతున్నారు.
Also Read: PanCard: మీ పాన్ కార్డుకి సంబంధించి ఈ మెసేజ్ వచ్చిందా అయితే జాగ్రత్త
అయోధ్య పురి రామనగరిని అందమైన ముద్దుగుమ్మలా రెడీ చేయనున్నారు. తొలి వార్షికోత్సవం సందర్భంగా ఏయే రోజున ఏయే ఉత్సవాలు జరుగుతాయనే సమాచారాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరించారు. రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను హిందూ పంచాంగం ప్రకారం, 22 జనవరి 2024న పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి రోజున నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Lal Bahadur Shastri లాల్ బహుదర్ శాస్త్రిని చంపిందేవరు..ఇప్పటికీ వీడని మిస్టరీ!
అయితే 2025లో జనవరి 11వ తేదీన పుష్య మాసం శుక్ల పక్షం ద్వాదశి తిథి వచ్చింది కాబట్టి, హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ తిథిని ‘ప్రతిష్ట ద్వాదశి’గా పిలవనున్నట్లు, జనవరి 11 నుంచి మూడు రోజుల పాటు నాలుగు ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య రామ మందిరంలో 11 జనవరి 2025 శనివారం మధ్యాహ్నం 12:20 గంటలకు రాంలాలా విగ్రహానికి పవిత్రాభిషేకం, మహా హారతితో పాటు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో సాధారణ ప్రజలు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు కొందరు సాధువులు కూడా ఈ ఉత్సవాలకు హాజరు అవుతారని సమాచారం.
ఈ ప్రాణ ప్రతిష్ట వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకుని ఐదు చోట్ల కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు రెండో కార్యక్రమాన్ని రామాలయ సముదాయంలో యాగమండపంలో, మూడో కార్యక్రమాన్ని యాత్రికుల సౌకర్యార్థం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
రాముని ప్రాణప్రతిష్ట వేళ జరిగే ఉత్సవాలలో మూడు రోజుల పాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాగ సేవ, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీ రాముడికి అత్యంత గొప్ప భక్తుడైన ఆంజనేయ స్వామి మందిరం ఈ రైల్వేస్టేషన్ నుంచి ఓ కిలోమీటర్ దూరంలో ఉంది. శ్రీరాముని దర్శనానికి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఆలయంలో అనుమతి తీసుకునే అయోధ్య వెళ్లాలని పెద్దలు అంటుంటారు.
ఈ ఆలయం రాజ ద్వారం ముందు ఎత్తైన గుట్టపై నిర్మించడం జరిగింది. అయోధ్యను కాపాడేందుకు వచ్చిన హనుమంతుడు ఇక్కడే ఉండేవారని చాలా మంది అనుకుంటారు.
దేవకాళి ఆలయం అయోధ్యకు నైరుతి దిశలో ఉన్న ఫైజాబాద్ నగరంలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో ప్రతిష్టించబడిన మాతా గిరిజా దేవి విగ్రహం విషయానికొస్తే, సీతా దేవి తనతో పాటు ఈ విగ్రహాన్ని తెచ్చుకుందని అంతా అనుకుంటుంటారు. దశరథ మహారాజు దేవకాళి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు సమాచారం. ఈ ఆలయం వివరాలు రామాయణంలో పూర్తిగా ఉన్నాయి.
రామనగరిలో మొదటి ప్రాణప్రతిష్ట కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడ కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు అయోధ్యలో నాగేశ్వరనాథ్ అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయం. శ్రీరాముడు ఈ ప్రాంతంలో స్వయంగా శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు.
Also Read: Karnataka: మళ్లీ బీర్ల ధరల పెంపు..కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం!