Lal Bahadur Shastri లాల్‌ బహుదర్‌ శాస్త్రిని చంపిందేవరు..ఇప్పటికీ వీడని మిస్టరీ!

ఓ దేశానికి అధినేత మరో దేశానికి అతిథిగా ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం చరిత్రంలో ఎప్పుడూ జరగలేదు.కానీ లాల్‌ బహుదూర్‌ శాస్త్రి చనిపోవడం మాత్రం ఇప్పటికీ విడనీ మిస్టరీగానే ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఈ స్టోరీలో..

New Update
sastry

sastry

ఓ దేశానికి అధినేత మరో దేశానికి అతిథిగా ఒప్పందాల మీద సంతకాలు చేసేందుకు వెళ్లి అక్కడ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం చరిత్రంలో ఎప్పుడూ జరగలేదు. అయితే ఈ మరణం గుండెపోటు వల్ల సంభవించిందని సోవియట్‌ ప్రభుత్వం తెలిపింది. భారత ప్రభుత్వం కూడా దీనిని ధ్రువీకరించింది. 

Also Read: Karimnagar: నెత్తురొడిన కరీంనగర్ రహదారులు.. ఐదుగురు యువకులు స్పాట్ డెడ్!

ఎన్ని అనుమానాలు వెల్లడైనప్పటికీ కూడా శాస్త్రి  భౌతికకాయానికి మాత్రం పోస్టుమార్టం నిర్వహించలేదు. శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగంతోనే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు గట్టిగా వినపడ్డాయి. ఆయన ఆఖరుగా తన కూతురితో సుమన్‌తో శాస్త్రి మాట్లాడారు. పాలుతాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్‌లైన్‌ డిస్కనెక్ట్‌ అయింది. దాదాపు 15 నిమిషాలకు పైగా సుమన్‌ లైన్‌ కోసం వేచి చూశారు. ఆ తర్వాత లైన్‌ దొరికింది కానీ, శాస్త్రి ఫోన్‌ తీయలేదు.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..!

సోవియట్‌కు చెందిన ఓ అధికారి ఫోన్‌ తీసి 'మీ తండ్రిగారు మరణించారు' అని సుమన్‌ కి చెప్పారు. ఎలాంటి ఆరోగ్యకర ఇబ్బందులు లేని శాస్త్రి 15 నిమిషాలలో మృతిచెందినట్లు చెప్పడం మీద సందేహాలు ఇప్పటికీ వెలువడుతున్నాయి. భారతదేశ మలి ప్రధాని, స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్రధారి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జై జవాన్ జై కిసాన్ నినాదంతో ప్రజల అభిమానాన్ని చూరగొన్న లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై సందేహాలు తీరనే లేదు. 

అప్పటి రష్యా రాజధాని తాష్కెంట్‌లో ఆయన గుండెపోటుతో మరణించారని తెలిపారు. కానీ, అది ప్రణాళికాపరంగా హత్య అనే చర్చకు తెర లేపింది. 1965 ఆగస్టులో కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. కశ్మీరు ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని అనుకుంటుంది. నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళికలు రెడీ చేశారు.

భారత సైన్యం విజయానికి చేరువలో ఉండగా శాస్త్రిపై అమెరికా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాక్ అధ్యక్షుడు ఆయూబ్‌ఖాన్, విదేశాంగ మంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను పాక్‌లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్‌కోటే కలిసి యుద్ధ విరమణ కోసం చర్చలు చేశారు. ఈ దశలోనే ఐక్యరాజ్య సమితి యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఆమోదించింది.. దీనిని అంగీకరించాలని శాస్త్రి మీద తాష్కెంట్‌లో తీవ్ర ఒత్తిడులు వచ్చాయి.

శరీరంపై కొన్ని గాట్లను..

కాల్పుల విరమణ తరువాత శాస్త్రి, అయూబ్‌ఖాన్ తాష్కెంట్‌లో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నారు. శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్‌ చుగ్‌ పక్కగదిలోనే ఉన్నా శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న సమాచారాన్ని సోవియట్‌ అధికారులు ఆయనకు చెప్పలేదు. మరణించిన తర్వాతే చెప్పారు. భారత్‌కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారి ఉంది. శరీరంపై కొన్ని గాట్లను కూడా ఆయన భార్య లలితా శాస్త్రి గమనించి అధికారులను ప్రశ్నించారు.

విషప్రయోగంతోనే శాస్త్రి మరణించారని ఆరోపించారు. శాస్త్రి కుమారుడు సునీల్ తండ్రి మరణానికి వెనుక ఉన్న కారణాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో శాస్త్రి మరణంపై దర్యాప్తునకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు కారులో బయలుదేరిన డాక్టర్‌ చుగ్‌ లారీ ఢీకొని చనిపోయారు. 

శాస్త్రితోపాటు తాష్కెంట్‌కు వెళ్లిన వ్యక్తిగత సేవకుడు  రామ్‌నాథ్‌ను కూడా కమిటీ వాంగ్మూలం నమోదుకు పీల్చింది. మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌లోని తన నివాసం నుంచి ఆయన బయటకి రాగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామ్‌నాథ్ తీవ్రంగా గాయపడి గతాన్ని మర్చిపోయాడు.


'పాకిస్తాన్ భవిష్యత్తులో ఎప్పుడు కూడా భారత్‌పై బలగాలను ప్రయోగించరాదనే' వాగ్దానం చేయాలని శాస్త్రి రష్యాలో అయూబ్‌ఖాన్‌ను అడిగారు. చర్చలు కొనసాగలేదు. తరువాత రోజే శాస్త్రి మరణించారు. భారత ప్రభుత్వం ఎటువంటి సమాచారం అందించలేదు. మీడియా నిశ్శబ్దంగా ఉంది. భారతదేశంలో ఈ కుట్ర జరిగే సాధ్యాసాధ్యాలను 'ఔట్‌లుక్ మ్యాగజైన్' తెలిపింది. 2009లో 'దక్షిణాసియాపై సీఐఏ దృష్టి' పేరిట అనుజ్‌ధార్‌ అనే రచయిత పుస్తకం రాశారు. 

శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచార హక్కు చట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయాన్ని కోరారు. ఇవ్వడానికి పీఎమ్ఓ నిరాకరించింది. ఆ సమయంలో సీఐఏ డైరెక్టర్‌‌‌గా ఉన్న రోబర్డ్‌ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్‌ అనే జర్నలిస్ట్‌తో కొన్ని విషయాలను చెప్పారు. శాస్త్రితో పాటు భారత్ అణు పితామహుడు డాక్టర్‌ హోమీబాబా మరణాలకు సీఐఏ ప్రణాళికలు రచించి అమలు చేసిందని తెలిపారు. తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని కోరాడు.

శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకే నెలలో జరిగాయి. రెండింటికి మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. ఈ రెండూ దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. 60 వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతలను హతమార్చడం సీఐఏ పనిగా పెట్టుకున్నట్లు వాదనలు వినిపించాయి.  దీనిపై కేంద్రం కేంద్రం నియమించిన రాజ్‌నారాయణ్ కమిటీ నివేదిక ఇప్పటికీ బయటపడలేదు. ఎక్కడా అందుబాటులోనూ లేదు. నిజాలు ఎప్పటికైనా వెలుగు చూస్తాయా?

Also Read: Delhi: పరీక్షలు రాయడం ఇష్టం లేక బాంబు బెదిరింపు ఈమెయిల్స్

Also Read: Delhi: ఢిల్లీని మూసేసిన పొగమంచు.. 100కు పైగా విమానాలు ఆలస్యం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు