ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులకు సంబంధించి మరి ఎక్కువ నేరాలు నమోదవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆధార్ కార్డులాగా..పాన్ కార్డు కూడా ఓ ముఖ్యభాగమై పోయింది. గత కొన్ని రోజులుగా పాన్ కార్డుకు సంబంధించి ఓ పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతుంది.
Also Read: Karimnagar: నెత్తురొడిన కరీంనగర్ రహదారులు.. ఐదుగురు యువకులు స్పాట్ డెడ్!
దీనిలో, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు 24 గంటల్లోపు తమ ఖాతా నుండి పాన్ వివరాలను అనుసంధానం చేయమని మెసేజ్ లు వస్తున్నాయి.ఒకవేళ అలా చేయకపోతే ఖాతా మూసివేయడం జరుగుతుందని హెచ్చరికలు మొబైల్స్ కు మెసేజ్ లు వస్తున్నాయి. ఈ మొత్తం విషయంలో పీఐబీ ఓ స్పష్టత ఇచ్చింది. అయితే అలాంటి పోస్టులు పూర్తిగా నకిలీవని పీఐబీ చెప్పింది.
Also Read: పొంగల్ దోపిడీ : రాజమండ్రికి రూ. 4వేలు, వైజాగ్ కు రూ.6వేలు!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లకు సంబంధించిన ఒక నకిలీ పోస్ట్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. దీనిలో, కస్టమర్లు తమ పాన్ సంబంధిత సమాచారాన్ని వారి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో 24 గంటల్లోపు అప్డేట్ చేయాలని, అలా చేయడంలో విఫలమైతే కస్టమర్ ఖాతాను మూసివేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.
Claim: The customer's India Post Payments bank account will be blocked within 24 hours if their Pan card is not updated. #PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) January 4, 2025
❌ This claim is #Fake
➡️ @IndiaPostOffice never sends any such messages
➡️ Never share your personal & bank details with anyone pic.twitter.com/B7CEdp0g2f
అయితే దీని మీద పీఐబీ ఓ క్లారిటీ ఇచ్చింది. పీఐబీ ఎలాంటి సందేశాలను పంపలేదని ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ పాన్ కార్డ్ స్కామ్ గురించి సమాచారాన్ని పంచుకుంటూ PIB సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అటువంటి వాదనలు నకిలీవని తెలిపింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులను ఈ మోసం గురించి అప్రమత్తం చేసింది. వాస్తవ తనిఖీలో, అటువంటి పోస్ట్లు మోసపూరితమైనవిగా తేలింది.
ఇండియా పోస్ట్ అటువంటి సందేశాలను పంపలేదని, పంపబోదని చెప్పింది. PIB ప్రకారం, ఇటువంటి నకిలీ సందేశాలు, పోస్ట్లు అనుమానాస్పద లింక్ను కలిగి ఉంటాయి. ఇది వినియోగదారులకు నష్టం కలిగిస్తుంది.
ఏ లింక్ను క్లిక్ చేయోద్దు
పాన్ కార్డుకు సంబంధించిన ఈ స్కామ్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేయడంతో పాటు, ఈ సందేశాలలో వచ్చిన ఏదైనా లింక్పై క్లిక్ చేయవద్దని లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని, ఖాతా మూసివేత వంటి వార్తల గురించి ఆందోళన చెందవద్దని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రజలకు సూచించింది. ఈ క్లెయిమ్లను అలాగే నివారించండి. ఇండియా పోస్ట్ ఎప్పుడూ ఎటువంటి సందేశాన్ని పంపదు.
సైబర్ నేరగాళ్ల కుట్రలు
ఈ విషయంలో PIB ఇప్పటికే పాన్ కార్డ్ వినియోగదారులను, ఇండియా పోస్ట్ కస్టమర్లను హెచ్చరించింది. ఇప్పుడు అలాంటి పోస్ట్లు వైరల్ అయిన తర్వాత మరోసారి హెచ్చరిక జారీ చేసింది. దీనిలో, PIB కస్టమర్లు తమ వ్యక్తిగత వివరాలను, బ్యాంకు ఖాతా సంబంధిత సమాచారం, పాన్ కార్డ్ వంటి వాటిని ఎవరితోనూ పంచుకోవద్దని కోరింది.
ఎందుకంటే సైబర్ నేరస్థులు తరచుగా ఇలాంటి నకిలీ సందేశాలను పంపడం ద్వారా ప్రజల నుండి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తారని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read: Mahabubnagar: లారీ, బస్సు మధ్యలో కారు..స్పాట్లోనే 25మంది!
Also Read: Lal Bahadur Shastri లాల్ బహుదర్ శాస్త్రిని చంపిందేవరు..ఇప్పటికీ వీడని మిస్టరీ!