/rtv/media/media_files/2025/06/23/aravind-kejriwal-rajyasabha-2025-06-23-20-29-02.jpg)
Arvind Kejriwal: తాను రాజ్యసభకు వెళ్లడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే తనను చాలాసార్లు వార్తల్లో రాజ్యసభకు పంపారని అన్నారు. తాను అక్కడికి వెళ్లడం లేదని.. ఎవరిని నామినేట్ చేయాలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయిస్తుంది. పంజాబ్లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికల్లో పార్టీ సిట్టింగ్ రాజ్య సభ సభ్యుడు సంజీవ్ అరోరా విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడంతో అరోరా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అరోరా స్థానంలో పార్టీ అధినేత కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వీటిపై కేజ్రీవాల్ స్పష్టతనిచ్చారు.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
🚨 🚨 #BreakingNews Arvind Kejriwal rules out Rajya Sabha seat as Sanjeev Arora wins Ludhiana West bypolls https://t.co/uqZ6jUIhp5
— Instant News ™ (@InstaBharat) June 23, 2025
Kejriwal emphasized he will not take the position, leaving the nomination decision to the party's political affairs committee, despite opposition…
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ఆప్ కార్యకర్తలు సంబరాలు
కాగా గుజరాత్లో రెండు స్థానాలకు, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. గుజరాత్లోని కడి స్థానంలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. విసావాదర్ స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా గెలిచారు. ఆయన బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్పై 17 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పంజాబ్లోని లుధియానా వెస్ట్ స్థానంలో కూడా ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా గెలిచారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా పరాజయం పొందిన ఆప్.. ఉపఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచింది. దీంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు నిరాశలో ఉన్న ఈ పార్టీకి ఈ గెలుపు ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
Also Read: ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి కష్టమేనా ? రవిప్రకాశ్ సెటైరికల్ ట్వీట్
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక