జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిపై సోషల్ మీడియాలో పాకిస్తాన్కు సపోర్టు చేస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. పాక్కు మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటివరకు అస్సాంకు చెందిన AIUDF ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాంతో సహా 36 మంది అరెస్ట్ అయ్యారు. అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అరెస్టులు కాగా ఒక్క అస్సాంలోనే 16 మందిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
Also read : India-Pak Border: టెన్షన్.. టెన్షన్.. సరిహద్దుల్లో మరో ఉగ్రకుట్ర భగ్నం
Also read : Marriage Cancel : కాబోయే భార్యకు లవర్ ఉన్నాడని ..పెళ్లి పీటల మీద ట్విస్ట్ ఇచ్చిన వరుడు!
పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే
పహల్గామ్లో జరిగిన దారుణమైన దాడికి సంబంధించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చే ఏ వ్యక్తినీ కూడా అస్సాం ప్రభుత్వం సహించదని సీఎం తేల్చి చెప్పారు. ఇక మేఘాలయ పోలీసుల ప్రత్యేక విభాగం తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా నుండి 30 ఏళ్ల సైమన్ షిల్లాను అరెస్టు చేయగా.. త్రిపురలోని ధలై జిల్లాలో రిటైర్డ్ టీచర్తో సహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై బిఎన్ఎస్లోని చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు త్రిపుర పోలీస్ సీనియర్ అధికారి తెలిపారు. కాగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
Also read : BCCIకి బిగ్ షాక్.. రోబో కుక్క వల్ల కోట్లలో లాస్.. హైకోర్టు నోటీసులు!
Also Read : UPSC CSE 2024 : కళ్లు కనిపించవు, తల్లి ప్రోత్సాహం.. UPSC ఫలితాల్లో 91వ ర్యాంక్ !
pahalgam terror attack | arrested | Assam MLA arrested | telugu-news | india