/rtv/media/media_files/2025/05/01/QZboqsF4snRICzMReg76.png)
Manu Garg
తండ్రిని, చూపు కోల్పోయిన కొడుకును ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ఓ తల్లి చేసిన కృషిని నిజంగా అభినందించాల్సిందే. ఇటీవలే రిలీజయిన UPSC ఫలితాల్లో అరుదైన జన్యు వ్యాధి కారణంగా దృష్టిలోపం ఉన్న మను గార్గ్ అనే 23 ఏళ్ల వ్యక్తి 91వ ర్యాంకు సాధించారు. తన తల్లి వందన జైన్ మద్దతు, మార్గదర్శకత్వంలో ఈ విజయం లభించిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన మను 8వ తరగతిలో చూపు కోల్పోవడంతో అతన్ని తల్లి ముందుకు నడిపించింది.
From losing his eyesight in Class 8 to cracking one of India’s toughest exams, Manu Garg’s UPSC journey is a tale of unmatched resilience and a mother’s unwavering love ❤️. In his words, ‘My mother left no stone unturned so that I could achieve my goal’ — her faith became his… pic.twitter.com/NVx19sgMqI
— ExploreBharat (@ExploreBharat47) May 1, 2025
లెక్కలేనన్ని గంటలు అతనితోనే
లెక్కలేనన్ని గంటలు అతనితోనే... కూర్చొని ఓపికగా ప్రతి పదాన్ని వివరిస్తూ పాఠాలు చెప్పి, అతనిలో పట్టుదలను పెంచింది. బ్రెయిలీ పరిజ్ఞానం లేకుండా, మను తన విద్యను కొనసాగించడానికి స్క్రీన్ రీడర్లు, ఆడియోబుక్స్, టాక్బ్యాక్ వంటి సహాయక సాంకేతికతలపై ఆధారపడి చదువును కొనసాగించాడు. 2023లో తన మొదటి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్ను క్లియర్ చేసిన మను గార్గ్ కానీ మెయిన్స్లో విఫలమయ్యాడు.
అయినప్పటికీ అతను పట్టు వదల్లేదు. 2024లో UPSC మెయిన్స్ కు మరింతగా ప్రిపేర్ అయ్యాడు. చివరికి అతన్ని విజయాన్ని చేరుకున్నాడు. నా లక్ష్యాన్ని సాధించడానికి నా తల్లి ఏ ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. ఆమె నాకు చేసిన దానిలో 10 శాతమైనా నేను చేయగలిగితే, నా జీవితం విజయవంతమైందని నేను భావిస్తానని మను గార్గ్ తెలిపాడు.
Also read : Marriage Cancel : కాబోయే భార్యకు లవర్ ఉన్నాడని ..పెళ్లి పీటల మీద ట్విస్ట్ ఇచ్చిన వరుడు!