/rtv/media/media_files/2025/11/15/blast-2025-11-15-06-27-17.jpg)
జమ్మూ కశ్మీర్లో ఘోరం జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరణించిన వారి మృతదేహాలను శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్కు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
పోలీస్ స్టేషన్లో బాంబ్ పేలుడు
— RTV (@RTVnewsnetwork) November 15, 2025
ఫరీదాబాద్ నుండి స్వాధీనం చేసుకున్న అమొనియం నైట్రేట్ తనిఖీ చేస్తుండగా ఘటన!#RedFort#jammukashmir#Srinagar#Nowgampic.twitter.com/ScKFau9xUv
Also Read : ఈ దేశ ద్రోహులకు నేషనల్ మెడికల్ కమిషన్ బిగ్ షాక్!
Also Read : తేజస్వీ యాదవ్కు చెమటలు పట్టించిన సతీశ్ కుమార్ ఎవరు ?
300 అడుగుల దూరం వరకు
రెస్క్యూ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా వెతుకుతున్నారు. పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే, సంఘటన స్థలం నుండి 300 అడుగుల దూరం వరకు శరీర భాగాలు కనుగొనబడ్డాయి. పేలుడు సంభవించినప్పుడు మంటలు, దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి.
పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఫరీదాబాద్ నుండి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను నిర్వహిస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. టెర్రర్ మాడ్యూల్ కేసులో స్వాధీనం చేసుకున్న సుమారు 360 కిలోల పేలుడు పదార్థాలు ఎక్కువగా పోలీస్ స్టేషన్లోనే నిల్వ చేయబడ్డాయి. ఈ కేసులో ప్రాథమిక FIR ఇక్కడే నమోదైంది.
#WATCH | A blast occurred near the premises of Nowgam police station in Jammu and Kashmir. More details awaited. Security personnel present at the spot. pic.twitter.com/nu64W07Mjz
— ANI (@ANI) November 14, 2025
Follow Us