Delhi: 400 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో 400లకు పైగా విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో.. అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక ఉన్నది 12వ తరగతి విద్యార్థి తండ్రి ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లు తేలింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌ లో..

New Update
bombthreat

bomb threat

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల 400 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయనే విషయం తెలిసిందే. 400 పాఠశాలలకు పైగా బాంబు బెదిరింపులు రావటాన్ని పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. బాంబు బెదిరింపులు చేసిన వారి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. బాంబు బెదిరింపుల వెనుక ఉన్నది ఓ 12వ తరగతి విద్యార్థిగా వెలుగులోకి వచ్చింది. 

Also Read: Zucker Berg: మెటాలో భారీగా ఉద్యోగ కోతలు...ప్రకటించిన జుకర్‌ బర్గ్‌!

దీంతో ఆ విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుఉ రెడీ అయ్యారు. ఈ క్రమంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాంబు బెదిరింపులు పంపిన విద్యార్థికి, అతడి తండ్రికి ఓ పొలిటికల్ పార్టీకి మద్దతిస్తున్న స్వచ్ఛంద సంస్థతో సంబంధం ఉన్నట్లు తెలిసింది.

Also Read: తిరుమలలో ఇంటి దొంగ..రెండేళ్లలో ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి ఎంత కొట్టేశాడంటే?

ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులకు  మరో కీలక విషయం తెలిసింది. ఆ స్వచ్ఛంద సంస్థ మహ్మద్ అఫ్జల్ గురుకు మద్దతిచ్చినట్లు తెలిసింది. ఈ అఫ్జల్ గురు 2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. విద్యార్థి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్, ఈమెయిల్స్ ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) వాడటంతో ట్రాక్ చేయడం కష్టంగా ఉందని పోలీసులు తెలిపారు.

సహాయం చేయలేకపోతున్నారని..

వీపీఎన్ వాడటంతో ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనేదీ గుర్తించడం సంక్లిష్టంగా మారిందని తెలిపారు. వీపీఎన్ వాడటంతో ఈ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లు కూడా సహాయం చేయలేకపోతున్నారని ఢిల్లీ లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ మధుప్ తివారీ వెల్లడించారు.విద్యార్థి తండ్రి నేపథ్యాన్ని కూడా పరిశీలిస్తున్నామని.. పార్లమెంట్ దాడి ఘటనలో నిందితుడు అఫ్జల్ గురుకు మద్దతునిచ్చింది ఈ ఎన్జీవోనే అని పోలీసులు కనుగొన్నారు.

దీంతో పాఠశాలలకు బాంబు బెదిరింపుల వెనుక ఉగ్రవాదుల కుట్ర కోణం ఏమైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు 2024 డిసెంబర్‌లో ఢిల్లీలోని 400లకు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే పరీక్షలు రాసే ఇష్టం లేక.. ఇలా చేసినట్లు విద్యార్థి పోలీసుల విచారణలో చెప్పాడు. 

Also Read: AP: ఆ ఊళ్లో సంక్రాంతి జరుపుకోరు..స్నానాలు కూడా చేయరు..ఎందుకంటే!

Also Read: TTD: పాలకమండలికి, అధికారులకు మధ్య విభేదాలు.. TTD చైర్మన్ కీలక ప్రకటన!

Advertisment