Big Breaking: రాజస్థాన్ లో దారుణం.. కూలిన స్కూల్ బిల్డింగ్..నలుగురు మృతి

రాజస్థాన్ లోని లోని మనోహర్ థానేలో ఉన్న పిప్ లోడీ గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు.

New Update
rajasthan

School building collapsed

రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లా లోని మనోహర్ థానేలో ఉన్న పిప్ లోడీ గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ ఉన్నట్టుండి కూలిపోయింది. ఇదొక గవర్నమెంట్ స్కూలు. పిల్లలు స్కూల్ లో ఉండగానే ఈ ఘటన జరిగింది. ఇందులో ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారు. మరో 40 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. 

శిథిలాల కింద నలభై మంది పిల్లలు..

ఝలావర్ జిల్లాలోని మనోహర్ థానేలో ఉన్న పిప్ లోడీ గవర్నమెంట్ స్కూల్లో ఈ దుర్ఘటన జరిగింది. ఇది జరిగిన సమయంలో అక్కడ 40 మంది పిల్లలతో పాటూ టీచర్లు కూడా మరికొంతమంది ఉన్నారు. ఉదయం 8.30 సమయంలో ఈ ఘటన జరిగింది. స్కూలు కూలిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు అందరూ చనిపోయే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్కూల్ బిల్డింగ్ ఎప్పటి నుంచో శిథిలావస్థలో ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు.  దీనిలో 8 వరకు చదివే పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది జేసీబీతో శిథిలాలను తొలగిస్తోంది.  

Also Read: Thailand-Cambodia war: థాయిలాండ్, కంబోడియా యుద్ధంలోకి చైనా.. ఆకాశం నుంచి బాంబుల వర్షం.. అసలేం జరుగుతోంది?

Advertisment
తాజా కథనాలు