School Building: కుప్పకూలిన పాఠశాల భవనం.. 22 మంది విద్యార్థుల మృతి!
స్కూల్ నడుస్తుండగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. ఈ ఘటన ఉత్తర మధ్య నైజీరియాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మరణించారు. మొత్తం 154 మంది విద్యార్థులు భవనంలో చిక్కుకుపోగా వారిలో 132 మందిని రక్షించారు. స్కూల్ టీచర్స్ విషయం తెలియరాలేదు.