Yogi Adityanath : దటీజ్ యోగి.. దిశాపటానీ ఇంటిపై కాల్పులు జరిపిన ఇద్దరు ఖతం !

బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం  చోటుచేసుకుంది.ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారని పోలీసులు తెలిపారు.

New Update
disha patani

బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ ఇంటిపై కాల్పుల కేసులో కీలక పరిణామం  చోటుచేసుకుంది.ఆమె నివాసంపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు అనుమానితులు ప్రముఖ అంతర్జాతీయ నేరస్థుల ముఠాతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున 3:45 గంటలకు ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు, వారికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తమ నుంచి తప్పించుకునేందుకు నిందితుల యత్నం చేయగా,  నిందితులిద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.

Also Read :  OG Movie Tickets: ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్!

కాగా సెప్టెంబర్ 12న తెల్లవారుజామున దిశా పటానీ ఇంటిపై కాల్పులు జరిపారు. కాల్పుల టైంలో ఇంట్లోనే దిశాపటానీ పేరెంట్స్, అక్క,  ఆమె తండ్రి రిటైర్డ్ పోలీస్ కమిషనర్ ఉన్నారు. ఈ ఘటనను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) నోయిడా యూనిట్ మరియు ఢిల్లీ పోలీసుల క్రైమ్ ఇంటెలిజెన్స్ (CI) యూనిట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఘజియాబాద్‌లో వారిని ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులను రోహ్‌తక్‌కు చెందిన రవీంద్ర, సోనిపట్‌కు చెందిన అరుణ్‌గా గుర్తించారు.

Also Read : Breaking: ఏడీఈ అంబేడ్కర్‌కు మరో షాక్‌.. స్నేహితుడి ఇంట్లో అక్రమాస్తులు గుర్తించిన ACB

24 గంటల్లోనే ఖతం

దిశా సోదరి ఖుష్బూ పటానీ హిందూ మతానికి చెందిన ఒక ఆధ్యాత్మిక గురువుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాల్పులు జరిపినట్లు సోషల్ మీడియాలో పేర్కొంది. అయితే, ఖుష్బూ పటానీ ఆ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. నేరాలపై జీరో టాలరెన్స్  విధానాన్ని అమలు చేస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. చెప్పిన 24 గంటల్లోనే వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.  

Also Read :  Asia cup 2025: తగ్గిన పాక్.. యూఏఈతో మ్యాచ్‌కు రెడీ.. లేకపోతే రూ.454 కోట్లు గోవిందా గోవిందా..!

Advertisment
తాజా కథనాలు