OG Movie Tickets: ఓజీ మూవీ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్!

పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను పెంచింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచినట్లు తెలిపింది.

New Update
Og Movie

Og Movie

పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. పవన్ కళ్యాణ్, ప్రియాంక  ప్రియాంక మోహన్‌ కాంబోలో రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ మూవీ టికెట్స్ కోసం ఏపీ ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంది. టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 25న రాత్రి  1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.1000 గా నిర్ణయించింది. అలాగే సినిమా రిలీజ్ డేట్ నుంచి అక్టోబరు 4 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌లో రూ.150 పెంచినట్లు తెలిపింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీనిపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైనర్స్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌కు ధన్యవాదాలు తెలిపింది. 

ఇది కూడా చూడండి: Sootravakyam: ఓటీటీలో రికార్డులు దుల్లగొడుతున్న మలయాళ మూవీ.. ఆలస్యమెందుకు ఈ థ్రిల్లర్ మూవీ చూసేయండి!

ఇది కూడా చూడండి: Neha Shetty: హాట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను పిచ్చేక్కిస్తున్న డిజే టిల్లు బ్యూటీ.. కిక్కించే ఫొటోలు చూశారా?

తెలంగాణాలో ధరల పెంపు?

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఓజీ టికెట్ ధరలను పెంచినట్లు ఇంకా ప్రకటించలేదు. అయితే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అవకాశం ఇవ్వడం లేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఓజీ మూవీకి బెనిపిట్ షోల కోసం పర్మిషన్ ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ధరల పెంపుకు అయితే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు