Manipur: మణిపూర్లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి
మణిపుర్లోని జిరిబామ్ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన దాడుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. జులై 13న అక్కడ కాల్పులు జరగడంతో దీనికి సంబంధించి ఆదివారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి.