/rtv/media/media_files/2026/02/15/mahashivratri-2026-rashifal-4-2026-02-15-10-41-44.jpg)
Mahashivratri 2026: నేడు మహాశివరాత్రి(Maha Shivaratri 2026). ఫాల్గుణ మాసంలోని చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజు ఉపవాసం పాటిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున భోలే నాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం, పూజలు చేస్తారు. కొంతమంది నిర్జలి ఉపవాసం పాటిస్తే మరికొందరు ఫల ఉపవాసం పాటిస్తారు. అయితే ఉపవాసం పాటించడానికి అనేక నియమాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా కొన్ని విషయాలను గుర్తించుకోవాలి. ఉపవాసం రోజున పొరపాటున కూడా తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకోండి. మొదటిసారి మహాశివరాత్రి ఉపవాసం చేస్తుంటే, పొరపాటున కూడా వీటిని తినకూడదు.
Also Read : Google Gemini Proతో అద్భుతమైన శివ-పార్వతి ఫోటోలు.. ప్రాంప్ట్స్ ఇవే!
తినకూడని ఆహారాలు
- తెల్ల ఉప్పు, నల్ల ఉప్పు
- వెల్లుల్లి, ఉల్లిపాయ
- కంది, శనగ, రాజ్మా, మసూర్ వంటి ఏ రకమైన పప్పు ధాన్యాలనైనా తినకూడదు.
- గోధుమ, బియ్యం, జొన్న, మొక్కజొన్న వంటి తృణధాన్యాలు
- ఉపవాస సమయంలో ముల్లంగి, క్యాబేజీ వంటి ఘాటైన వాసనగల కూరగాయలను కూడా తినకూడదు.
- నూనెలో వేయించిన పదార్థాలను కూడా తినకూడదు. వీటితో పాటు గుడ్డు, మాంసం
- మద్యం, పొగాకు, గుట్కా, పాన్, తమలపాకు
మీరు వీటిని తినవచ్చు
- పండ్లు , చిలగడదుంపలు వంటివి తినొచ్చు
ఉపవాసం ఉన్నప్పుడు ఒకసారి మాత్రమే తినే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఒకసారి ఆహారం తింటే రాతి ఉప్పుతో చేసిన వాటిని మాత్రమే తినాలి. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు లేకుండా తయారు చేయాలి.
Also Read : శివపార్వతులకు ఇష్టమైన నైవేద్యాలు ఇవే.. తయారీ విధానం వెరీ సింపుల్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
Follow Us