అంతు చిక్కని వ్యాధి.. ఈ వైరస్ సోకితే 48 గంటల్లో మరణమే!

కాంగోలో అంతు చిక్కని వైరస్ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే జనాలు చనిపోతున్నారు. ఈ అంతుచిక్కని వైరస్ బారిన పడి ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు కాంగో ప్రకటించింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని సూచనలు చేసింది. 

New Update
virus

virus Photograph: (virus)

ప్రపంచాన్ని వణికించి కరోనా కంటే డేంజరస్ వైరస్ ప్రజలను భయపెడుతోంది. కాంగోలో ఓ అంతుచిక్కని వైరస్ ప్రాణాలను తీసేస్తుంది. అంతు చిక్కని వైరస్ లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే జనాలు చనిపోతున్నారు. కాంగో దేశంలో ఈ వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ అంతుచిక్కని వైరస్ బారిన పడి ఇప్పటికే 53 మంది చనిపోయినట్లు కాంగో ప్రకటించింది. ఈ వైరస్ చాలా ప్రమాదకరమని, ప్రజలు వెంటనే అప్రమత్తం కావాలని సూచనలు చేసింది. 

ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఇది కూడా చూడండిఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

ఈ లక్షణాలు కనిపిస్తే..

రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రస్తుతం ఈ వైరస్ విజృంభిస్తోంది. అయితే ఈ వింత వ్యాధికి కారణమేంటో సరిగ్గా తెలియదు. ఈ ఏడాది జనవరిలో ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని బోలోకో గ్రామంలో ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు. బోలోకోలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇది సోకింది. ఈ వైరస్ సోకిన వెంటనే అలసట, విరేచనాలు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు మరణించారు. అయితే ఈ ముగ్గురు పిల్లలు గబ్బిలం మాంసం తిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీని వల్లే వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 500కి పైగా కేసులు ఉన్నట్లు కాంగో తెలిపింది. 

ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

Advertisment
Advertisment
తాజా కథనాలు