/rtv/media/media_files/2025/04/20/W2s4V8bFU6rbuklPrdJQ.jpg)
akshaya tritiya
అక్షయ తృతీయ నాడు హిందువులు ఎక్కువగా విలువైన వస్తువులు కొంటారు. ముఖ్యంగా బంగారం, వెండి వంటివి కొనుగోలు చేస్తుంటారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో శుభఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులను అసలు ఇంటికి తీసుకురాకూడదు. పొరపాటున తీసుకొచ్చినా కూడా దరిద్రం చుట్టుకుంటుందని పండితులు అంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
వీటిని తృతీయ నాడు కొంటే దరిద్రమే..
హిందువులకు అక్షయ తృతీయ చాలా ముఖ్యమైనది. ఈ తృతీయ నాడు బంగారం, వెండి వంటివి కొంటారు. అయితే కొందరు తెలియక కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. వీటివల్ల ఇంట్లో దరిద్రం చుట్టుకుంటుందని నిపుణులు అంటున్నారు. పొరపాటున కూడా అక్షయ తృతీయ నాడు కత్తి, సూది, బాణం వంటి వస్తువులను కొనకూడదు. వీటిని హింసగా భావిస్తారు.
ఇది కూడా చూడండి: TG Crime: హైదరాబాద్లో దారుణం.. నడి రోడ్డుపై స్నేహితుడుని నరికిన యువకుడు
ఇవన్నీ కూడా మనుషులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిని అసలు కొనకూడదు. వీటిని అక్షయ తృతీయ నాడు కొంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా సమస్యలు వస్తాయి. అలాగే ఇంట్లో సమస్యలు పెరుగుతాయి. ఆందోళన, ఒత్తిడి ఎక్కువగా పెరుగుతాయి. ఇంట్లో అశాంతి ఏర్పడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ నాడు వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనవద్దని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.