/rtv/media/media_files/2025/04/27/9W4gMyaFbaaAbZ0P2wQ6.jpg)
Akshaya Tritiya
వైశాఖ మాసంలో శుక్ల పక్ష తదియ నాడు ఘనంగా అక్షయ తృతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ తృతీయ నాడు హిందువులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తారు. వీటిని కొనుగోలు చేయడం వల్ల డబ్బు వృద్ధి చెందుతుందని నమ్ముతారు. ఈ తృతీయ నాడు ఏ వస్తువు కొన్ని కూడా అలానే వృద్ధి చెందుతుంది. కానీ తరగదని అంటుంటారు. అక్షయ తృతీయ నాడు కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేస్తే అంతా దరిద్రమంతా తొలగిపోయి.. అదృష్టం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అయితే ఏయే వస్తువులు దానం చేయడం వల్ల మంచి జరుగుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ ప్రకటన
ఈ వస్తువులు దానం చేస్తే..
అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ చేయాలి. ఈశాన్యం మూలన ఒక పీఠం ఏర్పాటు చేసి కుబేరుడు, లక్ష్మీదేవి ఫొటోను పెట్టి పూజ చేయాలి. ఉదయాన్నే కొత్త పండ్లు, పుష్పాలు అన్నింటితో పూజ చేయాలి. ఆ తర్వాత కొన్ని వస్తువులను తప్పకుండా దానం చేయాలని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!
అక్షయ తృతీయ రోజు పానకం, మంచి నీరు, చెప్పులు, గొడుగు, విసనకర్ర వంటివి దానం చేస్తే దరిద్రమంతా కూడా పోతుందని పండితులు అంటున్నారు. వీటితో పాటు మామిడి పండ్లను కూడా దానం చేస్తే.. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన