ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్టాక్స్ను కొడానికి మదుర్లు ఆసక్తి చూపించడంతో...సెన్సెక్స్ 150 పాయింట్లు పైన.. నిఫ్టీ 23,750 పైన ట్రేడ్ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతోంది.
Jan 02, 2025 09:58 IST
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశంగా పాక్
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలలో పాక్కు చోటు దొరికింది. తాత్కాలిక సభ్య దేశంగా రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్కు అవకాశం వచ్చింది. రెండేళ్లపాటూ పాకిస్తాన్ ఐరాస భద్రతామండలిలో ఉంటుంది. పాక్తో పాటూ గ్రీస్, పనామా, డెన్మార్క్, సోమాలియాలు కూడా సభ్య దేశాలుగా చేరాయి.
UN Security
Jan 02, 2025 08:36 IST
అమెరికా పిక్అప్ ట్రక్ విషాదం..ఉగ్రవాద చర్యేమోనని అనుమానం
న్యూ ఇయర్ వేళ అమెరికాలో జరిగిన మారణకాండ పెను విషాదాన్నే మిగిల్చింది. ఈ చర్యకు పాల్పడిన దుండుగుడు టెక్సాస్ కు చెందిన జబ్బార్గా గుర్తించారు.ఇతను నడిపిన వాహనంలో ఐసీస్కు సంబంధించిన చెండా దొరకడంతో ఈ దాడి ఉగ్రవాద చర్యేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
New Orleans Attack
Jan 02, 2025 08:35 IST
రైతులకు శుభవార్త.. పంట బీమా పథకాలను పొడిగించిన కేంద్రం
రైతులకు పంటల బీమా పథకాలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు నష్టం తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ పథకాలను పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ పథకంలో 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రైతులకు రూ.1,350కు ఇవ్వనుంది.
తిరుమలలో దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు టీటీడీ మరో వినూత్న ఏర్పాటు చేసింది. కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మెషిన్ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు.
Jan 02, 2025 08:32 IST
గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన
మేడ్జల్ దగ్గర ఉన్న సీఎఆర్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్ధినులు ఆందోళనకు దిగారు.గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ల్లో కెమెరాలు అమర్చారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు.300 వీడియోలు రికార్డ్ చేశారని చెబుతున్నారు.కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
CMR Engineering college
Jan 02, 2025 08:31 IST
రియల్ లైఫ్ టైమ్ ట్రావెలర్.. 2025 నుంచి 2024కు వెళ్లిన విమానం!
కేవలం సినిమాల్లో మాత్రమే టైమ్ ట్రావెలింగ్ మిషన్ గురించి మనం చూసి ఉంటాం.కానీ ఇక్కడ నిజంగానే ఓ విమానం 2025 లో టేకాఫ్ అయ్యి 2024 లో ల్యాండ్ అయ్యింది. అదేలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం..!
బోర్వెల్లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి
పదిరోజులు బోరు బావిలో ప్రాణాల కోసం పోరాడింది. కానీ బయటకు వచ్చిన కొన్ని గంటల్లో మరణించింది. రాజస్థాన్లో కోట్ పుతలీ–బహరోడ్ జిల్లాల్లో మూడు ఏళ్ళ చేతన మృతి అక్కడ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Borewell incident
Jan 02, 2025 08:28 IST
ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా..
నిత్యం విమాన ప్రయాణాలు చేసే వారికి బోర్ కొట్టకుండా ఎయిర్ ఇండియా నూతన సంవత్సర కానుకగా ఓ వినూత్న ఆలోచన చేసింది. ఇక నుంచి కొన్ని విమానాల్లో వైఫైని అందించి అందరినీ ఆశ్చర్య పరిచింది.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి