KCR On MP Elections : లోక్సభ ఎన్నికలపై కేసీఆర్(KCR) ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ఫలితాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇటీవల ఆసుపత్రి నుంచి డీఛార్జి అయ్యి గాయం నుంచి కోలుకున్నాక లోక్సభ ఎన్నికలపై వ్యూహం రచిస్తున్నారు గులాబీ బాస్. తెలంగాణలో బీఆర్ఎస్ తరపు 9మంది ఎంపీలు గత ఎన్నికల్లో ఎన్నుకోబడ్డారు. వీరిలో ఆరుగురిని మార్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. ముగ్గురు సిట్టింగ్లకు టికెట్లు కేసీఆర్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో మెదక్ ఎంపీగా ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే మెదక్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.
పూర్తిగా చదవండి..KCR : కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి ఎంపీ టికెట్ కట్?
పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేస్తున్నారట. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను మార్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
Translate this News: