Karnataka: 30 ఏళ్ల క్రితం మృతి చెందిన యువతికి వరుడు కావాలి..

కర్నాటకలోని ఒక ఫ్యామిలీ ఏకంగా 30 క్రితం మృతి చెందిన తమ కూతురు కోసం వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. కూతురు పెళ్లి కాకుండా మృతి చెందడంతో తమకు దురదృష్టం వెంటాడుతుందని భావించిన కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది.

Karnataka: 30 ఏళ్ల క్రితం మృతి చెందిన యువతికి వరుడు కావాలి..
New Update

సాధారణంగా న్యూస్‌ పేపర్లలో వివాహాలకు సంబంధించిన ప్రకటనలను చూస్తుంటాం. అందులో పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ, యువకులు చదువు, ఆస్తి, ఉద్యోగం లాంటి వివరాలు ఉంటాయి. కానీ కర్నాటకలోని ఓ పేపర్‌ వచ్చిన పెళ్లి ప్రకటనను చూసి అందరూ షాకవుతున్నారు. ఒక ఫ్యామిలీ ఏకంగా 30 క్రితం మృతి చెందిన తమ కూతురు కోసం వరుడు కావాలని ప్రకటన ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కన్నడ జిల్లాలోని 30 ఏళ్ల క్రితం ఓ పసికందు మృతి చెందింది. కూతురు వివాహం కాకుండానే చనిపోవడంతో.. తమను దురదృష్టం వెంటాడుతుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Also Read: తనకు తానే షూట్ చేసుకున్న సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డ్‌

ఈ నేపథ్యంలోనే 30 ఏళ్ల క్రితం మరణించిన తమ కుమార్తె ఆత్మకు శాంతి కలిగింపజేయాలనే ఆలోచనతో కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం పేపర్‌లో ప్రకటన ఇచ్చింది. '30 ఏళ్ల క్రితం మరణించిన యువతికి.. 30 ఏళ్ల క్రితం చనిపోయిన వరుడు కావలెను. ఇలాంటి వరుడు కలిగిన వారు ఇరు ఆత్మల వివాహానికి సహకరించండి. ఇందుకోసం ఫలానా నెంబర్‌కు కాల్ చేయండి' అంటూ ప్రకటనతో తెలిపారు. అయితే తాము ఎన్ని ప్రయత్నాల చేసినా వరుడు దొరకడం లేదని.. అందుకే ఇలా ప్రకటన ఇచ్చామని ఆ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Also Read: మనీష్ సిసోడియాకు షాక్.. మరోసారి కస్టడీ పొడింపు

#telugu-news #wedding #marriage #karnataka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe