Telangana : రేవంత్, చంద్రబాబు భేటీపై.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారని.. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.

New Update
Bandi sanjay: కాంగ్రెస్ హామీలను గాడిద గుడ్డుతో పోల్చిన బండి.. అదో అప్పుల పత్రం అంటూ!

Bandi Sanjay : తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు (CM Chandrababu), రేవంత్ (CM Revanth Reddy) భేటీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారు. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. సీఎంల భేటీని అడ్డుపెట్టుకుని ప్రజల్ని రెచ్చగొట్టాలని కేసీఆర్ (KCR) గోతికాడ నక్కలా ఉన్నారు. కేసీఆర్‌కు అవకాశం ఇవ్వొద్దని ముఖ్యమంత్రుల్ని కోరుతున్నాను. ఎవరైనా బీజేపీలోకి రావాలంటే వారు ఉన్న పార్టీకి రాజీనామా చేయాల్సిందే. ఈడీ, సీబీఐ కేసులున్న నేతల్ని బీజేపీ (BJP) లోకి తీసుకోమని' బండి సంజయ్ అన్నారు.

Also Read: మేడిగడ్డ బ్యారేజీ మట్టికి భారీ డిమాండ్.. ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం !

Advertisment
తాజా కథనాలు