Jobs : సింగరేణిలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసేయండి!
సింగరేణిలో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
సింగరేణిలో ఉన్న పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సింగరేణిలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు వివరించారు.
యూపీఎస్ సీ సివిల్ సర్విసెస్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మే 26న జరగాల్సిన ప్రిలిమ్స్ జూన్ 16కు వాయిదా వేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష మే 26న జరగనుండగా జూన్ 16న నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.
ఏపీ నిరుద్యోగులకు మరో శుభవార్త అందింది. 761 ఉద్యోగాలకుగానూ మార్చి 19న కాకినాడలోని పీ.ఆర్. కాలేజీలో ఉదయం 9 గంటలనుంచి జాబ్ మేళా నిర్వహించనున్నారు. పది నుంచి పీజీ వరకూ అర్హతలు, శాఖలను బట్టి జీతభత్యాలు చెల్లించనున్నారు.
టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఫ్రీ కోచింగ్ ఇవ్వనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు శిక్షణ ఇవ్వనుండగా మార్చి 12 నుంచి 26 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత నోటిఫికేషన్లో 503 పోస్టులకు 3.8 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి 563 పోస్టులకు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీలోని నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. రేపు.. అంటే ఈ నెల 18న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 563 పోస్టులకు.. 4.03 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడనున్నారు.
ఏపీలో నేడు గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. అరగంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం డైరెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.