/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-91-1.jpg)
NEETUG2025 exam conduct on 04 May
NEET: వైద్య విద్య ప్రవేశాలకోసం నిర్వహించే NEET పరీక్ష మే 4న జరగనుంది. 24 జిల్లాల్లో 190 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రం నుంచి 72,572 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.
📢 Public Notice | 30 April 2025
— National Testing Agency (@NTA_Exams) April 30, 2025
# NEET (UG) 2025 Admit Card Released
NTA will conduct #NEETUG2025 on 04 May (Sun) 2025, 2–5 PM IST
📝 Admit Cards are now available at 🔗 https://t.co/vupfOoEkmH
🔐 Login to download.
The allotted centres are mentioned on the admit card
Helpdesk:…
ఆ పెన్నులతోనే ఎగ్జామ్..
ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగనుండగా ఉదయం 11 గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1:30 గం.లకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారు. విద్యార్థి బయోమెట్రిక్ తప్పనిసరి. ఎగ్జామ్ హాల్ లో ఇచ్చే పెన్నులతోనే పరీక్ష రాయాలి.
NEET UG 2025 to be conducted in Pen and Paper mode (OMR based) in Single day and Single Shift. pic.twitter.com/H1DYTgSGqI
— National Testing Agency (@NTA_Exams) January 16, 2025
Also read : Uttar Pradesh : 21 ఏళ్లకే 12పెళ్లిళ్లు .. పెళ్లి చేసుకున్న గంటకే జంప్!
ఇవి తప్పనిసరి..
విద్యార్థులు అడ్మిట్ కార్డుతోపాటు గుర్తింపు కార్డును తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, పర్సులు, కలర్ఫుల్ దుస్తులు, బంగారు అభరణాలు అనుమతించరు. విద్యార్థులకోసం ఎగ్జామ్ సెంటర్ లో తాగునీటితోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సందేహాలకోసం టోల్ ప్రీ నంబర్ 1800 425 1442లో సంప్రదించాలని సూచించారు.
Also read : బద్మాష్ బంగ్లాదేశ్.. పాక్ పక్కన చేరి ఇండియానే ఆక్రమించుకోవాలని ప్లాన్..!
telangana | telugu-news