/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/exams-jpg.webp)
APPSC Group-1
APPSC: ఏపీ గ్రూప్-1 అవకతవకలపై సంచలన నిజాలు బయటపడుతున్నాయి. పరీక్ష పేపర్లను ఇంట్లో ఉండే మహిళలు, ఓ వెల్డర్తో దిద్దించినట్లు కేసు దర్యాప్తులో తేలింది. ప్రతి పేపర్ వెనుక దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. కానీ ఆ స్థానంలో వెల్డర్, ప్రైవేటు టీచర్, గర్భిణి సంతకాలు ఉండటం సంచలనం రేపుతోంది.
వెల్డర్ చేతిలోనే పేపర్ల తారుమారు..
ఈ మేరకు గత ప్రభుత్వం హాయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలు చేప్టటింది. అయితే ఈ పేపర్ల మూల్యాంకణంలో గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఒక వెల్డర్ను, పలువురు మహిళలు, ప్రైవట్ టీచర్లను వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్ట్రాంగ్రూమ్ లో పేపర్లు తీసుకెళ్లిన వెల్డర్.. వాటిని సంచుల్లో పెట్టి మళ్లీ స్ట్రాంగ్రూంకు చేర్చినట్లు దర్యాప్తులో నిర్ధారించారు. రూల్స్ ప్రకారం ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో పేపర్ మూల్యాంకనం చేయించాలి. దాని వెనక దిద్దిన వారిపేరు, హోదా ఉండాలి. అయితే ఇందుకు భిన్నంగా దిద్దిన పేపర్లపై వెల్డర్, ప్రైవేటు టీచర్, గృహిణీల సంతకాలు చూసి పోలీసులు విస్తుపోయారు.
66 మంది భాగస్వాములు..
అయితే హాయ్ల్యాండ్ రిసార్టులో జరిగిన ఈ వ్యవహారాల్లో ప్రమేయం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకుని, మూడు ప్రత్యేక బృందాలతో విచారిస్తున్నామని అధికారి ఏబీజీ తిలక్ తెలిపారు. అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో కమిషన్ కార్యాలయం నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఆన్షర్ షీట్స్ అక్రమంగా హాయ్ల్యాండ్కు తరలించారని, అక్కడ జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ప్రైవేటు స్కూల్ టీచర్ సతీశ్ కూడా పాల్గొన్నట్లు వెల్లడించారు. మూల్యాంకనం చేయని పేపర్లపై కూడా కమిషన్ ఉద్యోగులు సంతకాలు, స్టాంపులు వేశారని, మొత్తం ఈ వ్యవహారంలో 66 మంది భాగస్వాములవగా 5గురిని అరెస్ట్ చేయనున్నట్లు తిలక్ తెలిపారు.
Also Read: ఆరునెలలు కాల్పుల విరమణ...మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
హాయ్ల్యాండ్ రిస్టార్ట్స్లో మూల్యంకనం..
అంతేకాదు పేపర్ మూల్యంకణం చేసినందుకు రోజుకు ఒక్కొక్కరికి రూ.2వేలు ఇచ్చినట్లు తెలిపారు. పేపర్లు దిద్దిన వ్యక్తుల్లో ఒకరైన ప్రైవేటు స్కూల్ టీచర్ సతీష్ కేసుల భయంతో సూసైడ్ అంటెప్ట్ చేశాడని, అతనినుంచి కీలకమైన సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. ఏపీపీఎస్సీతో సంబంధం లేని గుంటూరు హాయ్ల్యాండ్ రిస్టార్ట్స్లో పేపర్లు దిద్దించారు. సిబ్బందికి మొత్తం రూ.1.14 కోట్లు ఖర్చు చేయగా, 26 రోజులకు హాయ్ ల్యాండ్ అద్దె, భోజనాలు, ఇతర ఖర్చులకోసం రూ.20.06 లక్షలు చెల్లించారు. ఓఎంఆర్ షీట్లు, డిజైన్ కోసం మరో కంపెనీకి నిధులు విడుదల చేయగా.. పేపర్ల భద్రత కోసం కర్నూలు పోలీస్ యూనిట్ నుంచి 15 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 32 మందిని నియమించారని వివరించారు.
Also Read: 'చర్చలు జరపండి.. యుద్ధం ఆపండి': బోరున ఏడ్చిన మెహబూబా ముఫ్తీ-VIDEO
డిజిటల్ మూల్యాంకనం రద్దు..
2018లో APPSC 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. 2020 డిసెంబరులో మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగాయి. 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాశారు. డిజిటల్ మూల్యాంకనం అనంతరం ఫలితాలు విడుదల చేశారు. కానీ కొంతమంది అభ్యర్థులు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా డిజిటల్ మూల్యాంకనం రద్దు చేసి మాన్యువల్గా చేయించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ మూల్యాంకనానికి, రెండోసారి మాన్యువల్ మూల్యాంకనానికి మధ్య ఎంపికైన అభ్యర్థుల్లో 62శాతం వ్యత్యాసం వచ్చింది. డిజిటల్ మూల్యాంకనం చేసినప్పుడు ఇంటర్వ్యూలకు 326 మందిని ఎంపిక చేయగా 202 మంది రెండోసారి మాన్యువల్ మూల్యాంకనంలో అనర్హులుగా మిగలడం సంచలనంగా మారింది. ఇప్పుడు కొంతమంది ఉద్యోగాల్లో ఉండగా వారి ఉద్యోగం ఊడుతుందా? ఉంటుందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.
group-1 | today telugu news