Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

రాజమండ్రిలోని జేఏసీ సమావేశం అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. టీడీపీ-జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై, ఉమ్మడి ప్రణాళికపై లోతుగా చర్చించామని.. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా దాదాపు 3గంటలసేపు చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం కూడా మాతో కలిసి రావడానికి సానుకూలంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలనీవ్వమని స్పష్టం చేశారు.

Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
New Update

వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రిలో జేఏసీ సమావేశానికి హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రణాళికపైనే ప్రధాన దృష్టిసారించామని.. రాష్ట్రభవిష్యత్తుపైనే నిర్ణయం పేర్కొన్నారు. ప్రజలకు ముందు కావాల్సింది భద్రత, సంక్షేమం, అభివృద్ధని.. రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించడంపైనే చర్చలుజరిపామని తెలిపారు. మేం కొట్టుకోమని, మా మధ్య గొడవలు రావు.. రానీయమని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయమని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఖరారయ్యాక వారం, పది రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తానమని.. బిజేపీ నాయకత్వం కూడా ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకుందని.. మాతో కలసి రావడానికి వారు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు.

రాష్ట్రానికి వైసీపీ అనే తెగులు పట్టుకుంది. జనసేన-టిడీపీ కలయికే ఈ తెగులుకు సరైన మందు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చారిత్రాత్మక సమావేశం నిర్వహించుకున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలులో అక్రమంగా, అరాచకంగా 70ఏళ్లపైబడిన సీనియర్ నేతను నిర్బంధించి, టెక్నికల్ ఇష్యూతో బెయిల్ రాకుండా చేయడం బాధాకరం.రేపల్లెలో అత్యంత దారుణంగా 14ఏళ్లకుర్రాడిని చంపిన వ్యక్తికి కూడా బెయిల్ వచ్చింది. చంద్రబాబు బెయిల్‎ను మాత్రం రాష్ట్రప్రభుత్వం సాంకేతిక కారణాలతో అడ్డుకుంటోంది. రాష్ట్రంలో అరాచకానికి అడ్డుకట్ట వేయాలంటే జనసేన-టీడీపీ ప్రభుత్వం రావడమే విరుగుడు. అన్యాయంగా జైలులో ఉంచిన చంద్రబాబు నైతిక మద్దతు కోసం, వారికి ధైర్యమిచ్చేలా, రాష్ట్రప్రజలకు భరోసా ఇవ్వడానికి రాజమండ్రిలో సమావేశం నిర్వహించామని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అరాచక విధానాలు కొనసాగుతున్నాయి

రాష్ట్రంలో ప్రజలను బెదిరింపులకు గురిచేసే అరాచక విధానాలు కొనసాగుతున్నాయి. అధికార ప్రభుత్వం సీపీఎం,సీపీఐ, బీజేపీలతో సహా అందరిపై దాడిచేసింది. ప్రతిపక్షనేత చంద్రబాబు నుంచి అచ్చెన్నాయుడు వరకు అరాచకం కొనసాగుతున్న నేపథ్యంలో.. అస్థిరతకు గురైన ఏపీకి సుస్థిరత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదన్నదే మా లక్ష్యం. దాదాపు 44రోజుల క్రితం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం, నన్ను ఏపీలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. దేశసమగ్రత, ఏపీ అభివృద్ధి మాకు ముఖ్యం. 2014లో అనుభవం ఉన్న నాయకుడు ఉండాలని భావించి టీడీపీకి మద్దతు ఇచ్చాం. మేం వైసీపీ అరాచకం, దోపిడీ, దారుణాలకు వ్యతిరేకం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎస్సీ,ఎస్టీ కేసులు పెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. నాసిరకం మందును ఏరులై పారించి 30 వేలకోట్లు దోచుకున్నారు. ఇసుక,మినరల్స్,ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. ఉద్యోగులను సీపీఎస్ విషయంలో మోసగించారని పవన్ తెలిపారు

ఉమ్మడి ప్రణాళికకోసం లోతైన చర్చలు

టీడీపీ-జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై ఉమ్మడి ప్రణాళిక కోసం సమావేశమయ్యాం. ఉమ్మడి మ్యానిఫెస్టోపై దాదాపు 3గంటలసేపు చర్చించాం. ఎలా కలసి పనిచేయాలనే విషయమై సీనియర్ నేతలు యనమల, మనోహర్ వంటివారితో లోతైన చర్చలు జరిపాం. భవిష్యత్ ఎన్నికల్లో ఎలా కలసి వెళ్లాలి.. సుస్థిర పాలనను ఎలా అందించాలి.. ఏపీ యువత,ఉద్యోగులు, రైతులకు ఎటువంటి పథకాలు ఉంటే బాగుంటుంది అనే అంశాలపై టీడీపీ విధానాలు, ఆలోచనలను లోకేష్ చెప్పారు. జనసేన కూడా తమ ఆలోచనను తెలియజేసింది. రాబోయే వందరోజుల్లో ఉమ్మడి ప్రణాళికను ఎలా తీసుకెళ్లాలనే అంశంపైనే చర్చించాం. 2024లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత రాజమండ్రిలో విజయోత్సవ సభ జరగాలన్నదే నా ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

#andhra-pradesh-news #tdp #pawan-kalyan #janasena #ap-politics #nara-lokesh #telugu-news #cbn
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe