వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమండ్రిలో జేఏసీ సమావేశానికి హాజరైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రణాళికపైనే ప్రధాన దృష్టిసారించామని.. రాష్ట్రభవిష్యత్తుపైనే నిర్ణయం పేర్కొన్నారు. ప్రజలకు ముందు కావాల్సింది భద్రత, సంక్షేమం, అభివృద్ధని.. రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించడంపైనే చర్చలుజరిపామని తెలిపారు. మేం కొట్టుకోమని, మా మధ్య గొడవలు రావు.. రానీయమని అన్నారు.ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనీయమని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ఖరారయ్యాక వారం, పది రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తానమని.. బిజేపీ నాయకత్వం కూడా ఇక్కడి పరిస్థితులు అర్థం చేసుకుందని.. మాతో కలసి రావడానికి వారు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: వారం,పదిరోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో వస్తాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
రాజమండ్రిలోని జేఏసీ సమావేశం అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో వారం, పది రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. టీడీపీ-జనసేన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై, ఉమ్మడి ప్రణాళికపై లోతుగా చర్చించామని.. అలాగే ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా దాదాపు 3గంటలసేపు చర్చించామని పేర్కొన్నారు. వైసీపీ అరచకానికి జనసేన-టీడీపీ ప్రభుత్వమే విరుగుడు అంటూ వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకత్వం కూడా మాతో కలిసి రావడానికి సానుకూలంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలనీవ్వమని స్పష్టం చేశారు.
Translate this News: