Israel Attacked Again on Gaza: ఇజ్రాయెల్ సైన్యాలు హఠాత్తుగా మళ్ళీ విరుచుకుపడుతున్నాయి. సెంట్రల్ గాజా అయిన నుస్రుత్ శిబిరానికి తూర్పు , వాయువ్య ప్రాంతాలలోకి ప్రవేశించి, శిబిరంలోని పెద్ద భాగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. డ్రోన్లు, మిస్సైల్స్తో విరుచుకుపడుతున్నాయి. ఇందులో డెయిర్ అల్ బలాహ్లోని అల్–హక్సా ఆస్పత్రి మొత్తం రక్తంతో తడిచి వధశాలగా మారిపోయిందని డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ పేర్కొంది. ఈ దాడిలో 200మంది చనిపోయారు. మరో 400మంది దాకా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చాలా మంది చిన్నారులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..GAZA: గాజాలో మళ్ళీ యుద్ధం..దాదాపు 200 మంది మృతి
గాజాలో మళ్ళీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సెంట్రల్ గాజాలో హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకరపోరు సాగుతోంది. ఇందులో దాదాపు 200 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 400మంది దాకా గాయపడ్డారని సమాచారం.
Translate this News: