బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక సారధి యూనస్. జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సహకారం ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేశారు. భారత్ తో అకారణంగా శత్రుత్వం పెంచుకుంటూ పాకిస్తాన్, చైనాలకు దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నేపాల్ డిప్యూటీ స్పీకర్ భేటీతో ఈ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి తన బుద్ధిని బయటపెట్టకున్నారు.
చైనాతో దోస్తీ కోసం..
గత నెలలో చైనా పర్యటనలో కూడా యూనస్ ఇవే వ్యాఖ్యలను చేశారు. కావాలని చైనాతో దోస్తీ కడుతూ భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న యునస్.. అప్పుడు కూడా భారత ఈశాన్య రాష్ట్రాల గురించి నోరు పారేసుకున్నారు. భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురను సెవెన్ సిస్టర్స్గా పిలుస్తారు. అవి బంగ్లాదేశ్తో ముడిపడి ఉన్నాయి. దీని వలన భారతీయులు సముద్రానికి చేరుకోవాలంటే తమ దగ్గర నుంచే వెళ్ళాలి. ఆ సముద్రానికి తామే రక్షకులము. కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటూ యూనస్ చెప్పారు. ఇది మాకు చాలా పెద్ద అవకాశం.. చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. దానికి భారత్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వచ్చింది.
today-latest-news-in-telugu | bangladesh | muhammad-yunus | china
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్బాల్ ఎంట్రీ అదిరిపోయింది
Bangladesh: బుద్ధి లేని బంగ్లాదేశ్..సెవెన్ సిస్టర్స్ పై యూనస్ వ్యాఖ్యలు
బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారాక ఆ దేశం భారత్ కు వ్యతిరేకంగా మారింది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు చేస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు బంగ్లా తాత్కాలిక సారధి యూనస్. తాజాగా మరోసారి ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడి తన అక్కసును వెళ్ళగక్కుకున్నారు.
Muhammad Yunus
బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక సారధి యూనస్. జలశక్తి, ఆరోగ్య సంరక్షణ, రవాణా, మౌలిక సదుపాయాలు వంటి అంశాల్లో సహకారం ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేశారు. భారత్ తో అకారణంగా శత్రుత్వం పెంచుకుంటూ పాకిస్తాన్, చైనాలకు దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా నేపాల్ డిప్యూటీ స్పీకర్ భేటీతో ఈ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మరోసారి తన బుద్ధిని బయటపెట్టకున్నారు.
చైనాతో దోస్తీ కోసం..
గత నెలలో చైనా పర్యటనలో కూడా యూనస్ ఇవే వ్యాఖ్యలను చేశారు. కావాలని చైనాతో దోస్తీ కడుతూ భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న యునస్.. అప్పుడు కూడా భారత ఈశాన్య రాష్ట్రాల గురించి నోరు పారేసుకున్నారు. భారత ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అంటారు. ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపురను సెవెన్ సిస్టర్స్గా పిలుస్తారు. అవి బంగ్లాదేశ్తో ముడిపడి ఉన్నాయి. దీని వలన భారతీయులు సముద్రానికి చేరుకోవాలంటే తమ దగ్గర నుంచే వెళ్ళాలి. ఆ సముద్రానికి తామే రక్షకులము. కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటూ యూనస్ చెప్పారు. ఇది మాకు చాలా పెద్ద అవకాశం.. చైనా ఆర్థిక బేస్ను విస్తరించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అని వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. దానికి భారత్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ కూడా వచ్చింది.
today-latest-news-in-telugu | bangladesh | muhammad-yunus | china
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్బాల్ ఎంట్రీ అదిరిపోయింది