/rtv/media/media_files/2025/06/21/j-35-2025-06-21-09-15-29.jpg)
J-35 Stealth Jets
భారత్, పాక్ మధ్య యుద్ధం ఆగింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం భారత్ మీద ఆధిపత్యం సాధించాలనే చూస్తోంది. దానికి తగ్గట్టుగా పొరుగు దేశాలతో కలిసి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కొత్త యుద్ధ విమానాలను కొంటోందని తెలుస్తోంది.
పహల్గాం దాడి తరువాత భారత్, పాకిస్తాన్ లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. భారత్ పాక్ లోని ఉగ్రస్థావరాల మీద దాడులు చేస్తే..దాయాది మాత్రం జనావాసాల మీద దండెత్తింది. అయితే నాలుగు రోజుల తర్వాత ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి కాల్పుల విరమణ చేసుకున్నాయి. కానీ ఇండియా ఆపరేషన్ సింధూర్ తాత్కాలికంగా మాత్రమే ఆగిందని..ఉగ్రవాదంపై తమ పోరు ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పింది. మరోవైపు పాకిస్తాన్ కూడా భారత్ ను ఎలా దెబ్బ కొట్టాలా అనే చూస్తోంది. దానికి కోసం బంగ్లాదేశ్, చైనాలతో జట్టు కట్టింది. అసలు భారత్, పాక్ యుద్ధం జరిగినప్పుడే ప్రపంచం అంతా ఇండియా వైపే ఉంటే..చైనా మాత్రం పాక్ వైపు ఉంది. ఇప్పుడు కూడా పాక్ కు యుద్ధ విమానాలు అమ్ముతోంది.
అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్స్..
నవంబర్ 2024లో చైనా J-35ని ఆవిష్కరించింది . మల్టీరోల్ మిషన్ల కోసం ట్విన్-ఇంజిన్, సింగిల్-సీటర్ సూపర్సోనిక్ జెట్, J-35 అధునాతన ఏవియానిక్స్ను కలిగి ఉంది. వీటిలో యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్డ్ అర్రే, ఎలక్ట్రో-ఆప్టికల్ టార్గెటింగ్ సిస్టమ్, ఇన్ఫ్రారెడ్ సెర్చ్-అండ్-ట్రాక్ ఉన్నాయి. దానికి తోడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్జెట్ ఎఫ్-35 కన్నా J-35 ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నవని చెబుతున్నారు. పాకిస్తాన్ J-35 జెట్ లను 40 కొందని తెలుస్తోంది. వీటి వల్ల ఎప్పటికైనా భారత్ కు ముప్పు తప్పదని అంటున్నారు. ఈ కొత్త ఫైటర్ జెట్ లను గుర్తించడం కష్టం. గగనతలంలోకి చొచ్చుకుని వెళ్ళే సామర్థ్యం ఉన్న ఈ జెట్ లను యుద్ధంలో నిలువరించడం అసాధ్యం అని తెలుస్తోంది. శత్రుదేశం గుర్తించే లోపే అవి చేయవలసిన నష్టాన్ని చేసేస్తాయేని అంటున్నారు.
Also Read: Iran-Israel War: మొన్న సై..ఇవాళ నై...ఇరాన్ కు ముఖం చాటేస్తున్న మిత్ర పక్షం