/rtv/media/media_files/2025/04/03/hh6wBY61UuJlWSjLxgI6.jpg)
Blood Bath
ట్రంప్ టారీఫ్ ల మోతకు ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. నిన్న దాదాపు అన్ని దేశాల మీదనా ట్రంప్ కొత్త టారీఫ్ లను విధించారు. దీని దెబ్బకు దాదాపు అన్ని దేశాల్లో షేర్ మార్కెట్ షేక్ అయింది. ఈరోజు భారత స్టాక్ మార్కెట్ కూడా దడదడలాడింది. ఘోరంగా షేర్లు పతనం అయ్యాయి. బంగారం ధర మరింత పెరిగింది. ఒక్క ఫార్మా తన్ని మిగతా అన్ని రంగాల షేర్లూ అతలాకుతలం అయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల పరిస్థితీ అలానే ఉంది. ఇప్పుడు అమెరికా వాల్ స్ట్రీట్ వంతు.
బ్లడ్ బాత్..
ఈరోజు మొదలవ్వడమే అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు అన్ని షేర్లూ ఎర్ర రంగు పులుముకున్నాయి. ప్రతీకార సుంకాల మూలంగా వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వినట్లు అవ్వడమే కాకుండా.. అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి వెళుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇది అమెరికా మార్కెట్ ను దెబ్బ తీస్తోంది. దీని కారణంగా ప్రధాన సూచీలన్నీ భారీగా పతనం అయ్యాయి. ఉదయం 10 గంటలకు డౌజోన్స్ 1500 పాయింట్లకు పైగా నష్టంతో 40,665 వద్ద ట్రేడవుతోంది. నాస్డాక్ దాదాపు 5 శాతం మేర క్షీణించగా.. ఎస్అండ్పీ 500 4 శాతం కుంగింది. అమెరికాలో పెద్ద షేర్లు అని చెప్పుకునే నైకీ 12 శాతం, యాపిల్ 9 శాతం తో నష్టాల్లో నడుస్తున్నాయి. ఐఫోన్లకు ప్రధన సప్లయర్ చైనా..ఆ దేశానికి 54 శాతం సుంకాలు విధించడంతో ఐఫోన్ల సప్లయ్ కు ఆటంక ఏర్పడుతుందనే ఆందోళన మొదలైంది. 2020 తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. వీటిో పాటూ టెస్లా, అమెజాన్, మెటా లాంటి మిగతా ప్రధాన షేర్లు కూడా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.
today-latest-news-in-telugu | usa | donald trump tariffs | stock-market
Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం