ఇండియా చేరుకున్న జేడీ వాన్స్ దంపతులు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో వాన్స్ భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

New Update

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో జేడీ వాన్స్ భేటీ కానున్నారు. అయితే వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు కొన్ని ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత వాన్స్‌ దంపతులకు ప్రధాని మోదీ విందు ఇస్తారు.

ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

కుటుంబంతో కలిసి జేడీ వాన్స్..

జేడీ వాన్స్ కుటుంబం నాలుగు రోజుల పర్యటన కోసం ఇటలీ నుంచి ఇండియాకు వచ్చారు. ఇక్కడ చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. అయితే జేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ తెలుగు మూలాలు ఉన్న మహిళ. జేడీ వాన్స్ ఇవాన్, వివేక్, మీరాబెల్‌ అనే ముగ్గురు పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

అమెరికా ఉపాధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియా పర్యటనకు జేడీ వాన్స్ రావడం ఇదే మొదటిసారి. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోదీని జేడీ కలవనున్నారు. ఆ తర్వాత వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు కొన్ని ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత జేడీ వాన్స్ దంపతులు విందు చేసి.. జయపురకు వెళ్తారు. అక్కడ రాంభాగ్ ప్యాలెస్‌లో బస చేసి.. అక్కడ చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఆ తర్వాత ఆగ్రా వెళ్లి.. 24వ తేదీన జయపుర నుంచి అమెరికాకు తిరిగి బయలుదేరుతారు. 

ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం

Advertisment
Advertisment
తాజా కథనాలు