/rtv/media/media_files/2025/05/21/B6b8IOFnlaDncHrUFGHy.jpg)
US Secretary of State Marco Rubio
అమెరికా ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా తమ దేశంలోనే ఉంటున్న విదేశీయుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి కొత్త నిర్ణయాలను తీసుకుంటోంది. దాని ద్వారా విదేశీయులపై కఠిన రూల్స్ ను అప్లే చేయడానికి సిద్ధపడుతోంది. నిన్న విదేశీ విద్యార్థుల సోసల్ మీడియాలను తనిఖీ చేయాలని డిసైడ్ అయింది. ీ రోజు అమెరికాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అమెరికన్లు చేసే పోస్టులను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్త రూల్ అప్లే చేసింది. యూఎస్ పౌరుల పోస్టులు, కామెంటలను సెన్సార్ చేయడానికి ప్రయత్నించే విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించంది. దాంతో పాటూ అమెరికాకు సంబంధించిన సోషల్ మీడియా కంటెంట్ ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారిపైనా ఈ వీసా నిషేధం అమలుకానున్నట్లు ప్రభుత్వం చెప్పింది. పలు దేశాల ప్రభుత్వాల నుంచి యూఎస్ సోషల్ మీడియా కంపెనీలకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
విదేశీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు..
అమెరికా పౌరులు లేదా నివాసితులు తాము సోషల్ మీడియాలో చేసిన పోస్ట్లను, కామెంట్లను తొలగించమని ఒత్తిడికి గురిచేయడం, అరెస్టు వారెంట్లు జారీ చేయడం, యూఎస్ టెక్ కంపెనీలను సైతం ఒత్తిడికి గురిచేసే విదేశీ అధికారులను లక్ష్యంగా చేసుకొని ఈ కొత్త పాలసీ తీసుకొచ్చామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. విదేశీ అధికారులకు ఇలా చేసే అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే గ్లోబల్ కంటెంట్ మోడరేషన్ పద్ధతులను పాటించడం, అధికార పరిధిని దాటి సెన్సార్ షిప్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇతర దేశాల అధికారులు టెక్ కంపెనీలను బలవంతం చేయడాన్ని కూడా ఒప్పుకోమని రూబియో చెప్పారు. అయితే పలానా దేశం ఇలా చేస్తోంది అని ఆయన ప్రత్యేకంగా ఏమీ మెన్షన్ చేయలేదు. కానీ కొంతమంది విదేశీ అధికారులు టెక్ కంపెనీలపై సెన్సార్ షిప్ చర్యలకు పాల్పడ్డట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. కొత్త రూల్ ప్రకారం యూఎస్ పౌరుడు ఎవరైనా అమెరికా గడ్డ మీది నుంచి తమ దేశానికి చెందిన సోషల్ మీడియాలో పోస్టు చేస్తే ఇతర దేశాల ప్రభుత్వాలు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి హక్కు లేదు.