Trump: వాణిజ్య ఒప్పందాలతోనే కాల్పుల విరమణ..ట్రంప్ అదే పాట

భారత్, పాక్ కాల్పుల విరమణకు తానే కారణమని అదే పాట మళ్ళీ పాడారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. హింసను తగ్గించడానికి వాణిజ్య ఒప్పందాలను ఉపయోగించానని...ఇరు దేశాల నాయకులను ఒప్పించానని చెప్పుకొచ్చారు. 

New Update
Trump

Trump

అమెరికాతో వాణిజ్యంపై ఎటువంటి చర్చ జరగలేదని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధాని మోదీ చాలా స్పష్టం ఈ విషయాన్ని తన ప్రసంగంలో కూడా చెప్పారు. వాణిజ్యం, ఉగ్రవాదం రెండూ ఒకటి కాదని..అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నది తప్పని అన్నారు. అయినా కూడా కూడా ట్రంప్ మాత్రం భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ జరగడానికి తానే కారణం అని మరోసారి డప్పు కొట్టుకున్నారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో జరిగిన యుఎస్-సౌదీ పెట్టుబడి ఫోరంలో, ట్రంప్ మాట్లాడుతూ, నేను వాణిజ్యాన్ని కాల్పుల విరమణ కోసం ఉపయోగించానని చెప్పుకొచ్చారు. వాణిజ్యాన్ని నిలిపేస్తామని బెదిరించి ఇరు దేశాలను దారి లోకి తీసుకువచ్చానని చెప్పారు. అయితే  భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికాతో సంప్రదింపులు జరిపామని...కానీ వాణిజ్యంపై ఎలాంటి చర్చ జరగలేదని మంత్రిత్వ శాఖ  ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు ద్వైపాక్షికంగా అంగీకారం కుదిరిందని, ఇందులో మూడవ పక్షం పాత్ర లేదని స్పష్టం చేసింది. 

శాంతి నా అతి పెద్ద కల..

నా ప్రమాణ స్వీకారోత్సవంలోనే నేను చెప్పాను..నాకు యుద్ధం అంటే ఇష్టంలేదు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం నా అతి పెద్ద కల అని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఉంది. అందుకే రష్యా, ఉక్రెయిన్ లమధ్య, భారత్-పాకిస్తాన్ లమధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేశానని చెప్పుకొచ్చారు ట్రంప్. భారత్, పాక్ లు అణ్వాయుధాల వ్యాపారం చేయొద్దని చెప్పానని ఆయన అన్నారు. దానికి బదులుగా వారు తయారు చేసే వస్తువులతో వ్యాపారం చేయమన్నానని తెలిపారు. ఇరు దేశాల నాయకులు తెలివైనవారు. అందుకే యుద్ధం ఆగిపోయింది. కాశ్మీర్ సమస్య పరిష్కారంపై అమెరికా రెండు దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. 

Tags : today-latest-news-in-telugu | america | 47th us president donald trump | india | pakistan

Also Read: Earth Quake: గ్రీస్ లో భారీ భూకంపం..

Advertisment
Advertisment
తాజా కథనాలు